మన పత్రిక వెబ్డెస్క్, కోనరావుపేట: చారిత్రక, సాంస్కృతిక విషయాలపై అవగాహన పెంచేందుకు కోనరావుపేట పీ.ఎం.శ్రీ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల విద్యార్థులు వరంగల్ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు.
ముఖ్యంగా రామప్ప ఆలయంలోని రుద్రదేవుడు, నందీశ్వరుని విగ్రహాలు, సన్నని దారం దూర్చేంత సూక్ష్మ రంధ్రాలున్న స్తంభాల పనితనం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అలాగే, నృత్య భంగిమలను తెలిపే శిల్పాలు, కాకతీయుల శిల్పకళా వైభవం, రామప్ప చెరువు ప్రాముఖ్యతను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు తెలియజేశారు.
Advertisement
ఈ విజ్ఞాన యాత్రలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదన్ లాల్, ఉపాధ్యాయులు విజయకుమార్, భాస్కర్, రాము, వెంకటేష్, సంజీవ్, శృతి, అనూష, రాధలతో పాటు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- బేబీ షవర్కు ముందు వివాదం: భర్త, అత్తను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
Advertisement
