ఫార్ములా-ఈ రేసు కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించగా, విచారణను న్యాయస్థానం ఆగస్టు 25కి వాయిదా వేసింది.

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసం, కామారెడ్డిలో ఇద్దరు అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ గేమింగ్ లింక్‌ల ద్వారా పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15 వేల నగదు, ల్యాప్‌టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వాహనదారుల నుంచి వసూళ్లు: ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి జిల్లా మద్నూర్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు.

గ్లోబల్ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో ముగిసే దిశగా నిఫ్టీ సూచీలు

గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్స్ మరియు గిఫ్ట్ నిఫ్టీ సంకేతాల ఆధారంగా దేశీయ స్టాక్ మార్కెట్ ఆరంభ పరిస్థితుల విశ్లేషణ.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు వెండి మాత్రం స్థిరం

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల వల్ల దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్ రెడ్డి

పాఠశాల విద్యలో తెస్తున్న సంస్కరణల పట్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బాన్సువాడలో వీధికుక్కల దాడి: ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

బాన్సువాడ టీచర్స్ కాలనీలో ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రథమ చికిత్స అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఉద్యోగుల బకాయిలకు రూ.2 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం గురువారం మూడో విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసి, ఇచ్చిన హామీ ప్రకారం రూ.6 వేల కోట్ల నిధులను పూర్తి స్థాయిలో చెల్లించింది.