Suryapet : ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..

మన పత్రిక, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఈటూరు గ్రామంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగస్వామి (33) గ్రామం నుంచి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో లింగస్వామి తలకు బలమైన గాయమైంది. … Read more

NEET UG 2026 : నీట్​ యూజీ రీ-ఎగ్జామినేషన్​కి భారీ భద్రత!

మన పత్రిక: జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, త్వరలో అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో దేశంలోని 551, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. గతంలో పేపర్ … Read more

Peddi : వీకెండ్ బ్లాస్ట్ పెద్ది @250కోట్లు… ఇక మీదుంటది అసలు సవాల్!

Peddi Movie Crossed 250cr mark at box office

రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఫైనల్ గా జూన్ 4న థియేటర్లలో విడుదలై సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ వీకెండ్ లో భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఫస్ట్ డే నే పెద్ది మూవీ 120 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, పెద్ది నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో 250 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ … Read more

School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక: Telangana రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13వ తేదీన రెండో శనివారం, అలాగే 14వ తేదీన ఆదివారం వరుసగా సెలవు దినాలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలవుల సర్దుబాటులో … Read more

కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

మన పత్రిక, కోహెడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో రూ.2,300 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 240 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. పండ్ల మార్కెట్‌తో పాటు అదే ప్రాంగణంలో … Read more

Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…

Peddi Advance Bookings Rocks at Box Office

మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న పెద్ది (Peddi) పై టాలీవుడ్ లో ఏ స్థాయి అంచనాలున్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొన్న ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి అదేమీ అడ్డుకానట్టు పెద్ది సినిమాకు భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మొన్నటివరకు IPL ఇంపాక్ట్ వల్ల సినిమా గురించి ఎవరు పట్టించుకోరు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఐపీఎల్ ముగిశాక లెక్కలన్నీ మారిపోయాయి. పెద్ది విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ఓవర్సీస్ … Read more

Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, పలు విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 31తో ముగియాల్సిన సెలవులు తాజా నిర్ణయంతో పొడిగించబడ్డాయి. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓయూ బాటలోనే … Read more

TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్ 2026 ఎడిషన్‌కు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 … Read more

TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్..

TG Employees Health Scheme

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ (EHS)ను పారదర్శకంగా అమలు చేసేందుకు ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నేడు (మే 31) సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), … Read more

AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి

మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన … Read more