Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు వెండి మాత్రం స్థిరం

మన పత్రిక: అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచడంతో ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరిగి, ఆ ప్రభావం మన దేశీయ మార్కెట్‌పైనా పడింది. అదే సమయంలో వెండి ధరలు మాత్రం మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పసిడి ధరలు ఒకే రీతిలో నమోదయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340 గా ఉండగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,310 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద స్థిరంగా ఉంది.

Advertisement

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు ఇలాగే ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,44,490, 22 క్యారెట్లు రూ.1,32,460 గా నమోదుకాగా, కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద విక్రయించబడుతోంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,340 గానూ, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,310 గానూ ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,340 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,310 గా ఉండి, అక్కడ కిలో వెండి ధర రూ.2,35,100 వద్ద నమోదైంది.

Advertisement