పల్నాడు: దాహమని నీళ్లు అడిగి.. మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం

మన పత్రిక, AP క్రైం: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దాహమని నీళ్లు అడిగిన వ్యక్తికి సహాయం చేయబోయిన ఓ మహిళపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మాచర్లలో చోటుచేసుకుంది. సత్తెనపల్లికి చెందిన బాధితురాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మాచర్లలో ఒంటరిగా నివసిస్తోంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇంటి తలుపు తట్టి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె లోపలికి … Read more

TG: గ్రూప్-1 అభ్యర్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మన పత్రిక, జాబ్స్: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా నిలుస్తుందన్నారు. “ఏళ్ల తరబడి కష్టపడి, … Read more

AP: మాజీ మంత్రిపై పేర్ని నానిపై కేసు నమోదు

మన పత్రిక, రాజకీయం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు దిగిన ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. చిలకలపుడి చిలకలపూడి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం, మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరులతో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా … Read more

ఓటీటీలో శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ ఏడాది వరుస సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులకి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తక్కువ గ్యాప్‌లో రెండు సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్‌లో హల్‌చల్ సృష్టించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన విష్ణు విన్యాసం రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలో, మార్చి 6న మృత్యుంజయ్ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో … Read more

నారాయణపేట: చిన్నారి అపహరణ.. చెరువు కట్టపై శవమై ప్రత్యక్షం!

మన పత్రిక, తెలంగాణ, క్రైం: నారాయణపేట జిల్లాలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య కలకలం రేపింది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ (5) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై లభ్యమవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తేజశ్రీ తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లగా, చిన్నారిని తాతమ్మల వద్ద ఉంచారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని … Read more

యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన బంగారం ధరలు!

మన పత్రిక: యుద్ధ ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం నాటికి 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,970 వద్ద ట్రేడ్ కాగా, 22 క్యారెట్ బంగారం రూ.1,36,550, 18 క్యారెట్ బంగారం రూ.1,11,730 వద్ద నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 … Read more

కమెడియన్ నుంచి హీరోగా సత్య కొత్త అవతారం

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సత్య ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘జెట్లీ’ అనే చిత్రంతో కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ‘వివాహ భోజనంబు’తో హీరోగా మెప్పించిన ఆయన, ఈసారి కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రిథేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ‘మత్తు వదలరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన … Read more

TG: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత ‘రైతుభరోసా’కు రంగం సిద్ధం!

మన పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే దిశగా రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.2,650 కోట్లను సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం. జీతాలు, అప్పుల కిస్తీలు చెల్లించిన తర్వాత మిగిలిన వనరులతో నిధుల సమీకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.మొత్తం మూడు విడతల్లో యాసంగి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న రూ.3,590 కోట్లను సుమారు … Read more

ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఈ … Read more

యుద్ధం.. ఆకాశానంటుతున్న గ్యాస్, నూనె ధరలు

మన పత్రిక, TG: నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ దందా.. మరోవైపు వంట నూనెల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిని, వంటగది ఖర్చులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర రూ.965 … Read more