TG News: రూ.5 వేల కోట్ల అమ్మకాలు, సర్కార్‌కు కాసుల వర్షం

మన పత్రిక, వెబ్​డెస్క్: కొత్త సంవత్సరం (2026) వేడుకల సందర్భంగా తెలంగాణలో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులతో పాటు వైన్ షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ప్రభుత్వం కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వడంతో విక్రయాలు జోరుగా సాగాయి. న్యూ ఇయర్ జోష్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు … Read more

న్యూ ఇయర్ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి, 15 మంది సీరియస్

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకలు విషాదాంతమయ్యాయి. భవానినగర్‌లో బుధవారం రాత్రి 17 మంది స్నేహితులు కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి, బిర్యానీ తిన్నారు. విందు ఆరగించిన కాసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మిగిలిన 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి … Read more

డీజీపీ ఆసక్తికర రియాక్షన్.. వైరల్ అవుతున్న సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల చరిత్రలో ‘కత్తుల సమ్మయ్య’ది ఓ ప్రత్యేకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. నక్సలైట్లకు కోవర్టుగా మారి, పోలీసులకు సహకరించి, పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన సమ్మయ్య ఉదంతం అప్పట్లో సంచలనం. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేముల సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీజీపీ రియాక్షన్: నిన్న ఓ జర్నలిస్ట్ కత్తుల సమ్మయ్య … Read more

Suryapet: యూరియా కొరత లేదు.. రైతులకు భరోసా!

సూర్యాపేటలో వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ: యూరియా కొరత లేదు.. రైతులకు భరోసా! మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మంగళవారం పిల్లలమర్రి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా అమ్మకాల తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని రైతులకు సూచించారు. యాసంగి 2025 సీజన్‌కు సంబంధించి జిల్లాలో యూరియా … Read more

District collector: కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియామకం..

మన పత్రిక, వెబ్​డెస్క్: నిజామాబాద్ జిల్లా పరిపాలనలో కీలక మార్పు జరిగింది. జిల్లా కలెక్టర్‌గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ (GHMC) అదనపు కమిషనర్‌గా నియమించారు. ఆయన స్థానంలో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఇలా త్రిపాఠిని నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలా త్రిపాఠి ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె భద్రాచలం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. … Read more

TG News: గురుకులంలో విద్యార్థినిని కర్రతో కొట్టిన వార్డెన్.. వీడియో వైరల్!

మన పత్రిక, వెబ్​డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ భవాని ఓ విద్యార్థినిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో వార్డెన్ తమను ఇలాగే హింసిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల … Read more

District collector: నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్..

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా పాలనా యంత్రాంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్‌గా ఇంతకాలం పనిచేసిన ఇలా త్రిపాఠిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. బడుగు చంద్రశేఖర్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (Additional Collector)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో మంచి అనుభవం ఉన్న చంద్రశేఖర్ రాకతో … Read more

చైనీస్ మాంజా అమ్మితే జైలుకే: జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: సంక్రాంతి సంబరాల వేళ గాలిపటాలు ఎగురవేయడానికి నిషేధిత చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. ఈ దారం విక్రయించినా, నిల్వ చేసినా, వాడినా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. వ్యాపారులు కేవలం లాభాల కోసం చైనీస్ మాంజా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఎస్పీ హితవు పలికారు. ఈ దారం వల్ల పక్షులు, మూగజీవాలే కాకుండా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర … Read more

బంగారం, వెండి రేట్ల పరుగు.. ఇప్పుడు కొనడం సేఫేనా?

మన పత్రిక, వెబ్​డెస్క్: బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర రూ.20 వేలు పడిపోగా, అంతకుముందు అంతే స్థాయిలో పెరిగింది. అయినా జనం ఎగబడి కొంటున్నారు. కొద్ది నెలల్లోనే వెండి రూ.2.50 లక్షలు, బంగారం రూ.1.40 లక్షలు దాటడం సామాన్యులతో పాటు వ్యాపారులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ పరుగు ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు కొనడం సురక్షితమేనా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ధరల పెరుగుదలకు … Read more

ఇండియా వదిలేసి వెళ్లిపోతున్న లక్షల మంది.. పన్నుల వేధింపులే కారణమా?

మన పత్రిక, వెబ్​డెస్క్: “నా దేశం అంటే నాకు ప్రాణం.. కానీ ఇక్కడి వ్యవస్థను భరించలేకపోతున్నా..” అంటూ బెంగళూరుకు చెందిన టెకీ కమ్ వ్యాపారి రోహిత్ ప్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం 18 నెలల్లో రూ.4 కోట్లు పన్ను నిజాయితీగా కట్టినా, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని, అందుకే ఇండియా వదిలేసి వెళ్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క రోహిత్ ఆవేదన మాత్రమే కాదు.. గత 14 ఏళ్లలో … Read more