మన పత్రిక, బనగానపల్లె: నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా టంగుటూరి శీనయ్య ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బనగానపల్లె పట్టణంలోని జి.ఎస్.ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ (TG Venkatesh) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శీనయ్యతో పాటు పాలకమండలి సభ్యులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా శీనయ్య మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల సమస్యలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల పట్ల తమ పార్టీకి ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం మరియు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందజేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
