AP: మాజీ మంత్రిపై పేర్ని నానిపై కేసు నమోదు

మన పత్రిక, రాజకీయం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు దిగిన ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. చిలకలపుడి చిలకలపూడి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం, మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరులతో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా … Read more

ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఈ … Read more

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదలకు కసరత్తు

మన పత్రిక : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు సర్కార్ తీపికబురు అందించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏతో పాటు ఇతర భారీ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన ఈ బిల్లుల కోసం ఉద్యోగులు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో, బకాయిల చెల్లింపులపై తగిన కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన … Read more

AP: డిసెంబర్‌ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లు..

మన పత్రిక, నాయుడుపేట: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏర్పాటు చేసిన ‘టిడ్కో’ (TIDCO) సంక్షేమ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కింద ఏకకాలంలో 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రాయచోటిలో … Read more

ఆంధ్రప్రదేశ్: విద్యుత్తు రంగంలో విప్లవాత్మక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరం (FY27)లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, అలాగే ట్రూఅప్ రూపంలో ప్రజలపై అదనపు భారం వేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిస్కమ్‌లకు ఏర్పడే ₹15,790 కోట్ల రెవెన్యూ లోటును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్‌సీ (APERC)కి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ప్రకటించిన విధంగానే 22 లక్షల … Read more

నేటి దినఫలాలు (మార్చి 25, 2026): బుధవారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మన పత్రిక, హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం.. నేటి (మార్చి 25, 2026 – బుధవారం) రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.) పంచాంగ వివరాలు:

School Of Agriculture: ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్..

మన పత్రిక, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం కోసం ప్రత్యేకంగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం, ఐటీ, ఏఐ, క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం కూడా ఒక బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. రైతులకు ఆర్థిక … Read more

ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ: కొత్తగా రూర్బన్

మన పత్రిక, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జనాభా, ఆదాయం ప్రాతిపదికన పంచాయతీలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తూ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నూతన సంస్కరణల్లో భాగంగా కొత్తగా ‘రూర్బన్’ పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. 10,000కు పైగా జనాభా ఉండి, రూ. కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలకు ఈ రూర్బన్ … Read more

విజయవాడలో అమానుషం.. ప్లే స్కూల్ చిన్నారిపై ఘోరమైన యాసిడ్ దాడి!

మన పత్రిక వెబ్​డెస్క్ : విజయవాడలోని విద్యాధరపురం ‘నేషనల్ ప్లే స్కూల్‌’లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదారేళ్ల వయసున్న ఓ పసిపాప ప్రైవేట్ పార్ట్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది. చిన్నారి బాత్రూమ్‌లో జారిపడిందని స్కూల్ యాజమాన్యం కట్టుకథ అల్లి తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రిలో చేర్పించింది. తీరా చూస్తే అవి యాసిడ్ గాయాలని నిర్ధారణ అయ్యింది. పరువు పోతుందనే నెపంతో ఆస్పత్రి బిల్లులు కట్టి … Read more

ఏపీలో బాలికలకు ఉచిత విద్య.. కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!

మన పత్రిక వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు ఇతర తరగతుల్లో (7 నుంచి 10) మిగిలిన సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు అర్హులైన బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు, అనాథలు, బడి మానేసిన డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, … Read more