మన పత్రిక వెబ్డెస్క్ : విజయవాడలోని విద్యాధరపురం ‘నేషనల్ ప్లే స్కూల్’లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదారేళ్ల వయసున్న ఓ పసిపాప ప్రైవేట్ పార్ట్పై యాసిడ్ దాడి జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది.
చిన్నారి బాత్రూమ్లో జారిపడిందని స్కూల్ యాజమాన్యం కట్టుకథ అల్లి తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రిలో చేర్పించింది. తీరా చూస్తే అవి యాసిడ్ గాయాలని నిర్ధారణ అయ్యింది. పరువు పోతుందనే నెపంతో ఆస్పత్రి బిల్లులు కట్టి యాజమాన్యం తొలుత ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం ఆ చిన్నారి మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పసిపాప భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్కూళ్లలో పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసులు స్పందించి నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
