Prajavani | హైదరాబాద్‌లో నేటి నుంచి ప్రజావాణి

Prajavani

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదల కాగా, అక్టోబర్ 13న అధికారిక నోటిఫికేషన్ జారీతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అదే రోజున జరగాల్సిన ప్రజావాణితో పాటు అన్ని ప్రజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రంతో కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి తిరిగి పునఃప్రారంభమవుతోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సాధారణంగా ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. గత … Read more

School | కూర లేక కారంతో భోజనం

mahbubabad eklavya school food issue

మన పత్రిక, వెబ్​డెస్క్: మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కలవరపరుస్తోంది. కూరగాయల సరఫరా టెండర్ ముగిసి 15 రోజులు గడిచినా కొత్త టెండర్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కూర లేకుండా కారంతోనే భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల విద్యార్థులు బయటకు రాలేక తమ సమస్యలు చెప్పుకోలేకపోయారు. నిన్న జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో విషయం బయటపడగా, ఈ రోజు … Read more

Bus Accident : మరో బస్సు యాక్సిడెంట్.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

bus accident in jangaon dist telangana

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా చాలా బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ … Read more

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

Telangana high court website hack

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. వెబ్ సైట్ లో ఉండే ఆర్డర్ కాపీలు, పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ఓపెన్ అయింది. బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తోంది.

Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదు : రాజాసింగ్

raja singh says bjp will not come to power in Telangana

Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ చనిపోతోంది.. కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో 50 ఏళ్లు అయినా.. ఆ తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు.

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్స్.. ఆధిక్యంలో కాంగ్రెస్

jubilee hills by election results 2025

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిశాయి. ఐదు రౌండ్లు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు షేక్ పేట్, ఎర్రగడ్డ, రహమత్ నగర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 8911 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 8864 ఓట్లు … Read more

Cotton Crop : రైతు కళ్ల ముందే 3 లక్షల విలువైన పత్తి పంట దగ్ధం

cotton crop burns in mahabubabad

Cotton Crop : ఆరుగాలం కష్టపడి పండించి.. చేతికొస్తుంది అని అనుకునే లోపే ఆ పంట చేతికి రాకుండా నాశనం అయితే ఆ రైతు బాధ వర్ణణాతీతం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్న గూడూరు మండలం రామచంద్రు తండాలో షార్ట్ సర్క్యూట్ తో రైతు బాదావత్ శంకర్ కు చెందిన పత్తి పంట దగ్ధమైంది. పత్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు ఆరబెట్టాడు రైతు. ఏమైందో తెలియదు … Read more

Konda Surekha : నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

minister Konda Surekha apologizes to nagarjuna

Konda Surekha : టాలీవుడ్ కింగ్ నాగార్జునకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి క్షమాపణలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దానిపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు ఒక రోజు ముందే నాగార్జునకు సారీ … Read more

Hijras Attack : డబ్బులు ఇవ్వలేదని ఇంటి యజమానిని చితకబాదిన హిజ్రాలు

hijras attack on house owner for not giving money in hydderabad

Hijras Attack : గృహ ప్రవేశం రోజు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఓ ఇంటి యజమానిని హిజ్రాలు చితకబాదారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో చోటు చేసుకుంది. కీసర సమీపంలోని చీర్యాల అనే ఏరియాలో ఉన్న బాలాజీ ఎన్‌క్లేవ్‌లో కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుకులను ఆ వ్యక్తి చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన హిజ్రాలు లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. వెంటనే మరో … Read more

Andesri : తెలంగాణ కవి అందెశ్రీ కన్నుమూత

Telangana poet and lyricist ande sri passes away

Andesri : తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఆయన ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అందెశ్రీ తెలంగాణ సాహిత్యానికి ఎంతో కృషి చేశారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించారు.