మన పత్రిక, వెబ్డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదల కాగా, అక్టోబర్ 13న అధికారిక నోటిఫికేషన్ జారీతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అదే రోజున జరగాల్సిన ప్రజావాణితో పాటు అన్ని ప్రజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రంతో కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి తిరిగి పునఃప్రారంభమవుతోంది.
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సాధారణంగా ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. గత నెల 6న జరిగిన చివరి ప్రజావాణికి మొత్తం 206 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ జి. ముకుందరెడ్డి సమక్షంలో జరిగిన ఆ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీటిలో గృహనిర్మాణ సంబంధిత ఫిర్యాదులు 98 ఉండగా, అందులో రెండు పడకల గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు 46, పెన్షన్కు 26, ఇతర శాఖలకు 36 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. నెలరోజుల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమవుతున్న ఈ రోజు ప్రజావాణికి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
