Cotton Crop : ఆరుగాలం కష్టపడి పండించి.. చేతికొస్తుంది అని అనుకునే లోపే ఆ పంట చేతికి రాకుండా నాశనం అయితే ఆ రైతు బాధ వర్ణణాతీతం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్న గూడూరు మండలం రామచంద్రు తండాలో షార్ట్ సర్క్యూట్ తో రైతు బాదావత్ శంకర్ కు చెందిన పత్తి పంట దగ్ధమైంది. పత్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు ఆరబెట్టాడు రైతు.
ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆరబెట్టిన పత్తికి నిప్పు అంటుకొని క్షణాల్లో పంట మొత్తం కాలి బూడిదైంది. ఆ పంట విలువ రూ.3 లక్షలు అని కళ్ల ముందే పత్తి పంట కాలిపోతున్నా ఏం చేయాలేకపోయామని రైతు కుటుంబ కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
