పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. రూ.4.17 లక్షలు స్వాహా! కలెక్టర్ సీరియస్

మన పత్రిక, వెబ్​డెస్క్: పెద్దపల్లి జిల్లాలో (Peddapalli district) పంచాయతీ నిధుల దుర్వినియోగం కలకలం రేపింది. ప్రభుత్వ నిధులను జేబులో వేసుకున్న సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్‌పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వేటు వేశారు. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా రూ.4,17,175 నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఇంటి పన్నులో భారీ గండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి … Read more

టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్ రాసేవారికి ‘ఆన్ డ్యూటీ’ సౌకర్యం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో టెట్ (TG TET) పరీక్షకు హాజరవుతున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. టెట్ పరీక్ష రాసే టీచర్లకు పరీక్ష రోజున ‘ఆన్ డ్యూటీ’ (OD) సౌకర్యం కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. 71,670 మంది టీచర్లకు ఊరట: తెలంగాణ టెట్ (TG TET- జనవరి 2026) పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి … Read more

మా వాటా ఇవ్వాల్సిందే.. లేదంటే జూరాల నుంచే నీళ్లు లిఫ్ట్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడేదే లేదని, అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా జరిగిన “నీళ్లు-నిజాలు” స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రానికి, కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జూరాల నుంచే నీళ్లు తీసుకుంటాం: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) సంబంధించి తొలి విడతలో 45 టీఎంసీలు, రెండో విడతలో 45 టీఎంసీలు.. వెరసి మొత్తం 90 టీఎంసీలకు అనుమతులు … Read more

TG Municipal Elections 2026 : ఈ నెలలోనే నోటిఫికేషన్.. జనవరి 10న ఫైనల్ లిస్ట్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections 2026) నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. ఈ నెలలోనే (జనవరి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ నెల రెండో లేదా మూడో వారంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓటర్ల జాబితా రెడీ: ఎన్నికల సంఘం ఇప్పటికే 117 మున్సిపాలిటీలు, 6 … Read more

Rythu Bharosa: ఆ భూములకు డబ్బులు కట్..

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకంలో కీలక మార్పులు చేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధులను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఈసారి చాలా మందికి నిధులు అందకపోవచ్చని తెలుస్తోంది. కేవలం పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. 10 లక్షల ఎకరాలకు కోత? గత ప్రభుత్వ హయాంలో భూమి … Read more

కేటీఆర్ ఫైర్.. ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులు

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేలాది మంది డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన ధ్వజమెత్తారు. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్ల నేతలను, డ్రైవర్లను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. హామీలను నెరవేర్చకుండా ప్రజలను … Read more

రెవెన్యూ అధికారులకు నల్గొండ కొత్త కలెక్టర్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా (Nalgonda District) నూతన కలెక్టర్ బి. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పరిపాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుక్రవారం తన ఛాంబర్‌లో తొలిసారిగా రెవెన్యూ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ కీలక ఆదేశాలు: ఈ సమావేశంలో భూభారతి, పౌరసరఫరాల శాఖ అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: వాట్సాప్‌లోకే హాల్ టికెట్లు..

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై హాల్ టికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌ (WhatsApp) నంబర్లకే పంపించాలని నిర్ణయించింది. ముందే ఎందుకు? వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 45 రోజుల నుంచి రెండు నెలల ముందే హాల్ టికెట్లను తల్లిదండ్రుల ఫోన్లకు పంపనున్నారు. హాల్ టికెట్లలో … Read more

PM Kisan: రైతులకు రూ.2000.. జమ అయ్యేది అప్పుడే! ఈ-కేవైసీ తప్పనిసరి

మన పత్రిక, వెబ్​డెస్క్: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. త్వరలోనే 22వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఎప్పుడు జమ అవుతాయంటే? ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 21 విడతల … Read more

కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.3000 కోట్ల నిధులు విడుదల? మాజీ సర్పంచుల్లో ఆశలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పట్టిన గ్రహణం వీడనుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. రూ.3000 కోట్లు పెండింగ్: గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు రూ.3000 కోట్ల నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో, పెండింగ్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర … Read more