నీటి వాటాల్లో రాజీపడేదే లేదు: గత పాలకుల పాపాలివే.. అసెంబ్లీలో లెక్క తేలుస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) అనంతరం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలివే:

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్.. 70% సబ్సిడీతో గేదెల పంపిణీ

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు. భారీ సబ్సిడీ: ఈ పథకం కింద … Read more

Drunk and Drive: న్యూ ఇయర్ రోజు 1198 కేసులు.. వాహనాలు సీజ్ 

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల జోష్‌లో నిబంధనలు మరిచిన మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా యువత మద్యం సేవించి రోడ్లపై చిందులు వేశారు. అర్ధరాత్రి దాకా రోడ్లపై హల్చల్ చేస్తూ, పోలీసు ఆంక్షలను బ్రేక్ చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల భరతం పట్టారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టారు. కేవలం హైదరాబాద్ … Read more

TG News: రూ.5 వేల కోట్ల అమ్మకాలు, సర్కార్‌కు కాసుల వర్షం

మన పత్రిక, వెబ్​డెస్క్: కొత్త సంవత్సరం (2026) వేడుకల సందర్భంగా తెలంగాణలో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులతో పాటు వైన్ షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ప్రభుత్వం కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వడంతో విక్రయాలు జోరుగా సాగాయి. న్యూ ఇయర్ జోష్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు … Read more

డీజీపీ ఆసక్తికర రియాక్షన్.. వైరల్ అవుతున్న సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల చరిత్రలో ‘కత్తుల సమ్మయ్య’ది ఓ ప్రత్యేకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. నక్సలైట్లకు కోవర్టుగా మారి, పోలీసులకు సహకరించి, పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన సమ్మయ్య ఉదంతం అప్పట్లో సంచలనం. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేముల సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీజీపీ రియాక్షన్: నిన్న ఓ జర్నలిస్ట్ కత్తుల సమ్మయ్య … Read more

Suryapet: యూరియా కొరత లేదు.. రైతులకు భరోసా!

సూర్యాపేటలో వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ: యూరియా కొరత లేదు.. రైతులకు భరోసా! మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మంగళవారం పిల్లలమర్రి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా అమ్మకాల తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని రైతులకు సూచించారు. యాసంగి 2025 సీజన్‌కు సంబంధించి జిల్లాలో యూరియా … Read more

District collector: కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియామకం..

మన పత్రిక, వెబ్​డెస్క్: నిజామాబాద్ జిల్లా పరిపాలనలో కీలక మార్పు జరిగింది. జిల్లా కలెక్టర్‌గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ (GHMC) అదనపు కమిషనర్‌గా నియమించారు. ఆయన స్థానంలో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఇలా త్రిపాఠిని నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలా త్రిపాఠి ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె భద్రాచలం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. … Read more

TG News: గురుకులంలో విద్యార్థినిని కర్రతో కొట్టిన వార్డెన్.. వీడియో వైరల్!

మన పత్రిక, వెబ్​డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ భవాని ఓ విద్యార్థినిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో వార్డెన్ తమను ఇలాగే హింసిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల … Read more

District collector: నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్..

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా పాలనా యంత్రాంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్‌గా ఇంతకాలం పనిచేసిన ఇలా త్రిపాఠిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. బడుగు చంద్రశేఖర్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (Additional Collector)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో మంచి అనుభవం ఉన్న చంద్రశేఖర్ రాకతో … Read more

చైనీస్ మాంజా అమ్మితే జైలుకే: జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: సంక్రాంతి సంబరాల వేళ గాలిపటాలు ఎగురవేయడానికి నిషేధిత చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. ఈ దారం విక్రయించినా, నిల్వ చేసినా, వాడినా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. వ్యాపారులు కేవలం లాభాల కోసం చైనీస్ మాంజా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఎస్పీ హితవు పలికారు. ఈ దారం వల్ల పక్షులు, మూగజీవాలే కాకుండా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర … Read more