బసవతారకం ఆసుపత్రికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో పేద క్యాన్సర్ రోగులకు నిబంధనల ప్రకారం ఉచిత వైద్యం అందించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఈనెల 24న విద్యాసంస్థల బంద్

నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు జులై 24న బంద్‌కు పిలుపునిచ్చాయి.

తెలంగాణలో అదనంగా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

తెలంగాణలో రబీ సీజన్ ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు అనుమతి లభించింది.

హైదరాబాద్‌లో ఉద్రిక్తత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో నాంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి: కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి

తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులో తల్లిదండ్రుల ఆధార్ తప్పనిసరి

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

కరీంనగర్‌లో తుపాకులు కత్తులతో బెదిరించి కోటిన్నర విలువైన సొత్తు దోపిడీ

కరీంనగర్ భగత్ నగర్‌లో దొంగలు ఆయుధాలతో ఒక ఇంట్లోకి ప్రవేశించి కోటిన్నర విలువైన బంగారం, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

తెలంగాణలో త్వరలో రానున్న లిఫ్ట్ భద్రతా చట్టం

తెలంగాణలో లిఫ్టులు, ఎస్కలేటర్ల భద్రత కోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

శంషాబాద్‌లో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.