తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన.. | Gaddar Film Awards 2025 Announced

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ‘గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025’ (2024 సంవత్సరానికి గాను) విజేతల జాబితాను ప్రకటించింది. నంది అవార్డుల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి అక్కినేని నాగేశ్వరరావు, సి.నారాయణ రెడ్డి పేర్లతో కొత్త అవార్డులను ప్రవేశపెట్టడంతో పాటు, స్పెషల్ జ్యూరీ అవార్డులను 6 నుంచి 8కి పెంచారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి … Read more

సింహ రాశి వారికి రాజయోగం.. ఆ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం నేటి (శనివారం, మార్చి 7, 2026) రాశి ఫలాలు మీ కోసం. నేటి గ్రహస్థితులు, నక్షత్ర సంచారం (ఉదయం 11:12 వరకు చిత్తా, ఆ తర్వాత స్వాతి) ఆధారంగా ద్వాదశ రాశుల (12 రాశులు) వారి దైనందిన జీవితం ఎలా ఉండబోతోంది? ఎవరికి వ్యాపార లాభాలు, ఎవరికి ఉద్యోగంలో ఒత్తిడి, ఏ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే పూర్తి … Read more

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్.. లాయర్ ఇంటి అల్లుడు కానున్న యంగ్ హీరో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ లో మరో కుర్ర హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యంగ్ హీరో సాయి శ్రీనివాస్ వివాహం నిశ్చయమైనట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కే చెందిన న్యాయవాదుల కుటుంబానికి చెందిన ‘కావ్య రెడ్డి’ అనే యువతితో ఆయన ఏడడుగులు నడవనున్నారని సమాచారం. ఆమె తాత రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి ప్రస్తుతం లాయర్ గా కొనసాగుతున్నారు. ఈ వారంలోనే … Read more

నా కథను నాశనం చేశారు.. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీపై సాయి మాధవ్ ఫైర్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) దర్శకురాలిగా పరిచయమైన ‘సరస్వతి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. తన కథను ఇష్టమొచ్చినట్లు మార్చేసి, దారుణంగా నాశనం చేశారని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బన్నీ వాసు, ఈటీవీ విన్ సపోర్ట్ తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వాస్తవానికి ఆయనే దర్శకత్వం వహించాల్సి ఉంది. “సినిమా నా కథతో మొదలై … Read more

ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ, ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా భారత్ పర్యటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జరిగిన అయతుల్లా అలీ ఖమేనీ సంతాప సభకు, అలాగే ‘రైసీనా డైలాగ్‌’కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఖతీబ్‌జాదా మాట్లాడుతూ.. ఇరాన్ కొత్త నాయకత్వాన్ని తామే నిర్ణయిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో … Read more

ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో జరుగుతున్న యుద్ధం సెగ మన సామాన్యుడి వంటింటికి చేరింది. అక్కడ రవాణా నిలిచిపోవడంతో.. మన దేశ ఆర్థిక వ్యవస్థపై, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడబోతోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు, అరటిపండ్లు, ఉల్లి, కూరగాయల షిప్‌లు నిలిచిపోవడంతో.. స్థానికంగా సరఫరా పెరిగి తాత్కాలికంగా వాటి ధరలు పడిపోనున్నాయి. ఉదాహరణకు ₹7 ఉన్న గుడ్డు రేటు ₹5 కి రానుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపే! … Read more

డీజే టిల్లు’ ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట విషాదం.

మన పత్రిక వెబ్​డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు, ‘బలగం’, ‘డీజే టిల్లు’ సినిమాల ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శశికళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విద్యుత్ శాఖలో ఉద్యోగ విరమణ అనంతరం 2018లో సినిమాల్లోకి ప్రవేశించిన మురళీధర్ కు ఆయన భార్య ఎంతో అండగా నిలిచారు. శశికళ గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా ప్రజాసేవ చేశారు. వరుస సినిమాలతో … Read more

విజయవాడలో అమానుషం.. ప్లే స్కూల్ చిన్నారిపై ఘోరమైన యాసిడ్ దాడి!

మన పత్రిక వెబ్​డెస్క్ : విజయవాడలోని విద్యాధరపురం ‘నేషనల్ ప్లే స్కూల్‌’లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదారేళ్ల వయసున్న ఓ పసిపాప ప్రైవేట్ పార్ట్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది. చిన్నారి బాత్రూమ్‌లో జారిపడిందని స్కూల్ యాజమాన్యం కట్టుకథ అల్లి తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రిలో చేర్పించింది. తీరా చూస్తే అవి యాసిడ్ గాయాలని నిర్ధారణ అయ్యింది. పరువు పోతుందనే నెపంతో ఆస్పత్రి బిల్లులు కట్టి … Read more

ఐపీఓ ముంగిట ఫ్లిప్‌కార్ట్ సంచలనం.. వందలాది ఉద్యోగులపై వేటు!

మన పత్రిక వెబ్​డెస్క్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. వార్షిక పనితీరు (పెర్ఫార్మెన్స్) సమీక్షల ఆధారంగా సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) కు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న సంస్థ.. ఒకవైపు వివిధ విభాగాల్లో సీనియర్ స్థాయి అధికారులను (వైస్ ప్రెసిడెంట్లను) కొత్తగా నియమించుకుంటూనే, మరోవైపు ఈ … Read more

మాదిగల కోసం కర్ణుడిలా నిలబడ్డా.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుపై మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో మిత్రుడి కోసం నిలబడిన కర్ణుడు, బలహీనుల పక్షాన పోరాడిన బర్బరీకుడి పాత్రలను గుర్తుచేస్తూ.. న్యాయం వాళ్ల వైపు ఉన్నందునే తాను మాదిగల వెంట నిలబడినట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ప్రకటించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని సీఎం గుర్తుచేశారు. … Read more