కరెంట్ షాక్తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి
మన పత్రిక, వెబ్డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more