Advertisement

సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించిన తెలంగాణ బీజేపీ నేతలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ (Telangana BJP) ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ యాత్రను పార్టీ నేతలు ప్రారంభించారు. తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ రెండు రోజుల యాత్రలో కిషన్ రెడ్డి, రాంచందర్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. సింగరేణిని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతోనే ఈ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించారని వారు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement