లలిత్ మోదీకి ఊరట ఫెమా కేసును కొట్టేసిన ట్రిబ్యునల్

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై ఉన్న ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసును అప్పీలేటు ట్రిబ్యునల్ కొట్టేసింది. ఈ తీర్పుతో ఆయన స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కలిగింది.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు: నలుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు

ఆగస్టు 1న జరగనున్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది.

తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించాం: అచ్చెన్నాయుడు

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

ఎల్‌ఐసీ మరియు ఈపీఎఫ్‌ఓ వద్ద ఉన్న క్లెయిమ్ చేయని నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన కాదంబరి జెత్వాని

ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని ఆరోపణలను ముంబై నటి కాదంబరి జెత్వాని ఖండించారు. తనపై వచ్చినవి అబద్ధపు ఆరోపణలని ఆమె పేర్కొన్నారు.

రంభ ఊర్వశి మేనక సినిమా నుండి నా కంటి మీద కునుకే పాట విడుదల

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న రంభ ఊర్వశి మేనక సినిమా నుంచి మొదటి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది.

బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి: కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి

తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.