‘రాజా సాబ్’కు నైజాంలో బిగ్ షాక్.. ఇంత పెద్ద సినిమాకు ఆ ఒక్కటి మైనస్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్స్ పడుతున్నాయి. కానీ, ప్రభాస్ అడ్డాగా భావించే నైజాం (Nizam) ఏరియాలో మాత్రం సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా, ఇప్పటి వరకు ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ఫ్యాన్స్‌ను, ట్రేడ్ వర్గాలను … Read more

సర్కార్ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’.. పిల్లలకు రవాణా సౌకర్యం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ (Pre-Primary) విద్యను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో … Read more

ఉపాధి హామీ రద్దుకు మోదీ కుట్ర.. అదానీ, అంబానీ కోసమే ఇదంతా

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. పేదల పాలిట వరమైన ఈ పథకాన్ని రద్దు చేసి, గ్రామీణ ప్రజలను మళ్లీ బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్పొరేట్ల కోసమే ఈ తతంగం గ్రామాల్లో … Read more

ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో ఆ జిల్లా దశ తిరిగినట్లే!

మన పత్రిక వెబ్​డెస్క్, నెల్లూరు: నెల్లూరు నగర రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, నగర అభివృద్ధికి బాటలు వేసేలా కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు చుట్టూ దాదాపు రూ.1,930 కోట్ల భారీ వ్యయంతో 83.64 కిలోమీటర్ల మేర ‘ఔటర్ రింగ్ రోడ్డు’ (ORR) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎక్కడ మొదలై.. ఎక్కడ వరకు? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల … Read more

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విజయవాడలో జరుగుతూ వచ్చిన స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలను ఈసారి నుంచి రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) రాజధాని ముస్తాబవుతోంది. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ రాజధానిలోని మంత్రుల బంగ్లాలకు ఎదురుగా ఉన్న 10 ఎకరాల సువిశాల స్థలంలో పరేడ్ గ్రౌండ్‌ను సీఆర్డీఏ … Read more

రాజకీయాలు మనవి కావు.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పాలనలో అనుసరించాల్సిన విధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న దౌర్జన్య రాజకీయాలకు టీడీపీ పూర్తి భిన్నమని, బెదిరింపులు, ‘రప్పా రప్పా’ సంస్కృతి తమకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రజాసేవే మన అజెండా ఎన్నికల్లో గెలిచామా లేదా … Read more

2,419 బస్సులు బంద్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి బిగ్ షాక్..

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ (Sankranti) రద్దీ మొదలైన వేళ ఏపీఎస్ఆర్టీసీకి, ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పండుగ కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించిన ఆర్టీసీకి.. అద్దె బస్సుల యజమానుల నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు 2,419 అద్దె బస్సుల యజమానులు హెచ్చరిస్తున్నారు. పండుగ సమయంలో అత్యంత కీలకమైన అద్దె బస్సులు నిలిచిపోతే గ్రామీణ, పట్టణ ప్రాంత … Read more

ప్రణయ్ హత్య కేసు: అమృత బాబాయ్‌కి బెయిల్..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు తనకు … Read more

Polavaram Project: డిసెంబర్ 2027 నాటికి పూర్తి – సీఎం చంద్రబాబు

మన పత్రిక వెబ్​డెస్క్, పోలవరం: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, భద్రతా చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న అడ్డంకులను దశలవారీగా తొలగించి, పనులను తిరిగి గాడిలో పెట్టామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 87 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు … Read more

అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) అభివృద్ధి, రాజధాని భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా కీలక అడుగులు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని అధికారిక రాజధానిగా ఖరారు చేస్తే, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు … Read more