Advertisement

జంతర్ మంతర్ వద్ద నిహంగ్ సిక్కుల హెచ్చరికలు

మన పత్రిక: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థులు చేపట్టిన ‘చలో పార్లమెంట్’ ఆందోళన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లాఠీచార్జి వంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, విద్యార్థులు తమ పోరాటాన్ని విరమించలేదు.

నిహంగ్ సిక్కుల ప్రత్యక్షం

విద్యార్థుల నిరసనకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న తరుణంలో, అకస్మాత్తుగా ‘నిహంగ్’ సిక్కులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో ఒక నిహంగ్ సిక్కు యువకుడు అక్కడి భద్రతా సిబ్బందిని, పోలీసులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము దాడులకు దిగితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్కరి శరీరాలు గాయాలతో నిండిపోతాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి.

Advertisement
Advertisement