TG News: టోల్ ప్లాజా వద్ద కారు పల్టీ – 100 కిలోల గంజాయి

telangana news

మన పత్రిక, వెబ్​డెస్క్: మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ కారు పల్టీ కొట్టింది. పోలీసులు తనిఖీ చేస్తుండగా, డ్రైవర్ తప్పించుకోవాలని ప్రయత్నించి, ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనం తనిఖీ చేశారు. దానిలో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ₹15 లక్షలు. పట్టుబడిన వారిని తూప్రాన్ పోలీస్ … Read more

Nalgonda: నల్గొండలో ఆర్టిఏ చెక్ పోస్ట్ మూత

Nalgonda rta checkpost news

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని వాడపల్లి ప్రాంతంలో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్ట్ ను అక్టోబర్ 22, బుధవారం నుంచి మూసివేస్తున్నారు. ఈ మేరకు ఆర్టిఏ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ చెక్ పోస్ట్ ద్వారా లభించే టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలను ఇకమీదట ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవచ్చు. పౌరులు www.transport.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అన్ని ఆర్టిఏ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ | Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting october 23 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం మూడు గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, పారుదల శాఖ లు వంటి అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం ఏ నేపథ్యంలో జరుగుతోందంటే – స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఉన్నత న్యాయస్థానాలు స్టే విధించడం, సుప్రీంకోర్టు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్య … Read more

IAS transfer | తెలంగాణలో 4 IASల బదిలీ

Telangana 4 IAS Transfer

Telangana 4 IAS Transfer: తెలంగాణలో నలుగురు IAS అధికారుల బదిలీలు జరిగాయి. చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ ఎం. రఘునందన్ రావుకు (M.Raghunandan Rao) కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు, ఎస్. హరీశ్‌కు (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్ బాధ్యతలు, భవేష్ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కాంత్రి వల్లూర్‌ను పదవి నుంచి తప్పించారు. దేవాదాయ శాఖ … Read more

తెలంగాణలో మినీ DSC 2025 & పోలీస్ ఉద్యోగాలు – త్వరలో నోటిఫికేషన్!

MINI DSC 2025 TELANGANA: టీచర్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 టీచర్ ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మినీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉద్యోగార్థులకు సూచన: సిద్ధం కండి!నిరుద్యోగులు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని గుర్తుచేశారు. … Read more

అక్టోబర్ 30న విద్యాసంస్థల బంద్ | Telangana Bandh

Telangana bandh on October 30 SFI

Telangana bandh on October 30 SFI: స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30న ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలు, యూనివర్సిటీలకు బంద్ పిలుపునిచ్చింది. ప్రధాన డిమాండ్లు: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఫీజులు డిమాండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది.

Nizamabad Constable Murder Case: కుటుంబానికి రూ.1 కోటి సహాయం

Nizamabad Constable Murder Case

తాజా సమాచారం: నిజామాబాద్ లో డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు: “డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.” ప్రమోద్ కుమార్ భార్య ప్రణీత, ముగ్గురు కుమారుల భవిష్యత్తులో ప్రభుత్వం పూర్ణ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. … Read more

18 వేల కోట్ల దుర్వినియోగం: కేసీఆర్ పాలనలో ఘోర వైఫల్యం – రేవంత్ ప్రభుత్వం గుర్తించిన బోగస్ ఉద్యోగులు

telangana 18000 crore fraud kcr

ఒకప్పుడు కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు – “ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండరు.” కానీ, ఈ ప్రకటన ఎంత డొల్ల యవ్వారమో ఇప్పుడు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన IFMIS (Integrated Finance Management & Information System) ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వివరాలను క్రోడీకరించారు. IFMIS ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4,93,820 మంది కంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 2,74,844 … Read more

Liquor Shops Tenders : నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

today is deadline for applications for liquor shops in Telangana

Liquor Shops Tenders : తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు కేవలం 50 వేల దరఖాస్తులు మాత్రమే రావడంతో దరఖాస్తులు వెయ్యాలంటూ ఔత్సాహికులకు ఫోన్లు, మెసేజ్ లను ఎక్సైజ్ శాఖ పంపిస్తోంది. గతంతో పోల్చితే ఈ సారి దరఖాస్తు చాలా తక్కువగా వచ్చాయి. గత సంవత్సరం 1.31 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.

BC Bandh: తెలంగాణలో బంద్ శాంతియుతంగా

BC Bandh

తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన “బీసీ బంద్” శాంతియుతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా, మిగిలిన అన్ని రంగాలు పని చేయడం ఆపాయి. కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, మావోయిస్టు పార్టీలు, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఉప్పల్, చెంగిచర్ల డిపోల ముందు, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వికారాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌లో … Read more