మన పత్రిక వెబ్డెస్క్, సూర్యాపేట: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా రోడ్డుపై పోలీసులు ఆపితే చలానా వేస్తారని భయపడే వాహనదారులకు.. జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు అందించి ఆశ్చర్యపరిచారు.
ఆంధ్ర వెళ్లే వారికి.. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనదారులకు ఎస్పీ నరసింహ స్వయంగా పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని ఎఫ్సీఐ (FCI) గోదాం వద్ద జాతీయ రహదారి-65పై ఆయన వాహనాల రద్దీని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులను ఆపి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, కుటుంబంతో సంతోషంగా పండుగ జరుపుకుని, అంతే క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
భద్రత ముఖ్యం పండుగ రద్దీ దృష్ట్యా మితిమీరిన వేగంతో వెళ్లవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎస్పీ సూచించారు. పోలీసుల స్నేహపూర్వక వైఖరిని వాహనదారులు అభినందించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
