ఐపీఎల్‌లో ‘సూర్యవంశీ’ విధ్వంసం.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం

మన పత్రిక, క్రికెట్: ఐపీఎల్-2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సర్వశక్తులూ ఒడ్డి చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకోగా, రాయల్స్ బౌలర్ల ధాటికి చెన్నై కుప్పకూలింది. తేలిపోయిన చెన్నై బ్యాటింగ్ మొదట బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. రాజస్థాన్ పేసర్లు నండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో చెన్నై … Read more

ఈ 3 రాశుల వారికి రాజయోగం, విశేష ధనలాభం! (ఏప్రిల్ 5 – 11)

మన పత్రిక, హైదరాబాద్: గ్రహాల కదలికలు, సంచారాల ఆధారంగా కొత్త వారం (ఏప్రిల్ 5 నుంచి 11 వరకు) రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఈ వారంలో సూర్యుడు, కుజుడు, శని గ్రహాలు మీన రాశిలో సంచరించనున్నాయి. అలాగే బుధుడు కుంభ రాశిలో, శుక్రుడు మేష రాశిలో, గురువు మిథున రాశిలో ఉండనున్నారు. ఇక చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో సంచరిస్తాడు. ఈ విశేష గ్రహాల కలయిక వల్ల ఈ … Read more

TG Inter Result 2026: టీజీ ఇంటర్ ఫలితాలపై అప్‌డేట్..

మన పత్రిక, హైదరాబాద్: Telangana Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ నుంచి 4 లక్షల మంది, సెకండ్ ఇయర్ నుంచి 5 లక్షల మంది.. మొత్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. … Read more

సూర్యాపేట లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం

మన పత్రిక, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. పోలీసు, న్యాయ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,890 కేసులను వేగవంతంగా పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. ఇందులో ఎంవీ … Read more

AP: డిసెంబర్‌ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లు..

మన పత్రిక, నాయుడుపేట: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏర్పాటు చేసిన ‘టిడ్కో’ (TIDCO) సంక్షేమ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కింద ఏకకాలంలో 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రాయచోటిలో … Read more

నేటి దినఫలాలు (30 మార్చి 2026): శూల యోగం.. మకరం, మీన రాశులకు అద్భుత విజయాలు!

మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం (మార్చి 30, 2026) రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు శూల, గండ యోగాలు ఏర్పడనున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే.. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు … Read more

ఏప్రిల్ 2026 బ్యాంక్ 14 రోజులు సెలవులు..

మన పత్రిక, హైదరాబాద్: ఏప్రిల్ (2026) నెలలో బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే కస్టమర్లకు ముఖ్య గమనిక. రాబోయే ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఆర్థిక సంవత్సర ముగింపు, వరుస పండుగలు, ప్రభుత్వ మరియు వారాంతపు సెలవులు కలుపుకుని ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం సెలవులు ఉండనున్నాయి. ఈ 14 రోజుల సెలవుల్లో 4 ఆదివారాలు, 2 శనివారాలు (రెండో, … Read more

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన ధరలు

మన పత్రిక, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గతవారం వరకు చుక్కలనంటిన చికెన్ ధరలు ఈ వారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో చికెన్‌పై ఏకంగా రూ. 100 వరకు ధర దిగిరావడం విశేషం. మార్చి నెల ఆరంభంలో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో కోళ్లు చనిపోవడం, దాణా ఖర్చులు పెరగడంతో ఫామ్ యజమానులు ధరలు పెంచారు. దానికితోడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ … Read more

నిర్మల్: గంజాయి మత్తు ఇచ్చి.. ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి

మన పత్రిక, క్రైం: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులు బాలికలకు గంజాయి మత్తు ఇచ్చి ఓ పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక బాలికపై లైంగిక దాడి జరగగా, మరో మైనర్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితులు మహారాష్ట్రకు చెందిన వలస కూలీల కుటుంబానికి చెందినవారని స్థానికులు తెలిపారు. సున్నితమైన అంశం కావడంతో … Read more

శరవేగంగా ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్.. 70 శాతం పూర్తి!

మన పత్రిక, సినిమా: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’పై అంచనాలు పెరుగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నూతన నటి ఇమాన్వీ కథానాయికగా పరిచయం అవుతోంది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని Ramoji Film Cityలో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తుండగా, ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తైంది. బ్రిటీష్ కాలం … Read more