రంగారెడ్డి: నేడు పరీక్ష.. నిన్న పదో తరగతి విద్యార్థి మృతి

మన పత్రిక, తెలంగాణ: పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నిండింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనిత దంపతుల కుమారుడు అభిలాష్‌ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల … Read more

HYD: చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో పాటు తనకు అందిన రూ.10 లక్షల నగదును ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ప్రకటించారు. సామాజిక బాధ్యతగా ఈ మొత్తాన్ని సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లకు అందజేశారు. వీటితో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి … Read more

నేటి దినఫలాలు (28 మార్చి 2026): సుకర్మ యోగం.. ఈ రాశులకు విశేష ధనలాభం!

మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం (మార్చి 28, 2026) రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడి ప్రభావంతో ఈరోజు ‘సుకర్మ’, ‘ఉభయచారి’ యోగాలు ఏర్పడనున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే.. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి … Read more

సుంకం తగ్గినా.. వినియోగదారులకు అందని రూ. ‘పది’ తగ్గింపు

మన పత్రిక, కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 మేర తగ్గించిన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ తగ్గింపు నేరుగా వినియోగదారులకు లభించదనే అంశం స్పష్టమవుతోంది. ఈ ఉపశమనం ప్రధానంగా HP, BP, IOC వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే వర్తిస్తుంది. క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఖర్చులు భారీగా పెరగడంతో ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. … Read more

రేపటి నుంచి ఐపీఎల్.. RCBకి కీలక బౌలర్ దూరం!

మన పత్రిక, స్పోర్ట్స్: రేపు ప్రారంభమయ్యే Indian Premier Leagueకు ముందే Royal Challengers Bengaluruకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జట్టుకు కీలక బౌలర్‌గా భావించిన నువాన్ తుషారా(Nuwan Thushara) ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు ఎన్‌ఓసీ ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు సమాచారం. గాయం ఏదీ లేకపోయినా ఫిట్‌నెస్ సరిగా లేదనే కారణంతో ఐపీఎల్‌లో పాల్గొనడాన్ని అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్(Chaminda … Read more

లాక్‌డౌన్ వార్తలు.. కేంద్రం మంత్రి ఏమన్నారంటే..?

మన పత్రిక: దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ విధించే అవకాశముందన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, లాక్‌డౌన్‌పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఐకమత్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి, … Read more

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై శుభవార్త

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి అనిశ్చితి నెలకొన్నా, దేశీయ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి పౌరుడికి రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దీనికి అదనంగా, తదుపరి రెండు నెలల అవసరాలను తీర్చేందుకు వీలుగా ముడి చమురు … Read more

TG: ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌.. మెనూ ఇదే..!

మన పత్రిక, తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ అమలుకు అధికారులు కసరత్తు పూర్తి చేసి, వారాంతపు మెనూను సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధక అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.720 కోట్లను కేటాయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు … Read more

తిరుపతి: పాల కోపం ఏడ్చిందని.. కూతురిని చంపేసింది

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: పాల కోసం ఏడుస్తోందని ఆగ్రహించిన ఓ తల్లి.. ఆరు నెలల పసికందును ఊపిరాడకుండా చేసి చంపేసిన అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో జరిగింది. తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌కు, హేమావతితో 2018లో వివాహమైంది. వీరికి కుమారుడు రుత్విక్(5), కుమార్తె జోషిక(6 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ పనికి వెళ్లిన కొద్దిసేపటికే హేమావతి ఫోన్ చేసి.. “నీకో బ్యాడ్ న్యూస్, నాకో గుడ్ న్యూస్.. పాపను చంపేశాను” అని … Read more

HYD: నేడు వైన్ షాపులు బంద్..!

మన పత్రిక, హైదరాబాద్: నగరంలో శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కళ్లుదుకాణాలు అలాగే స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీచేస్తూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు … Read more