ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన పత్రిక: దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో పసిడి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 … Read more

SVNIRTAR Typist/Clerk Recruitment 2026 Notification Apply Online

Swami Vivekanand National Institute of Rehabilitation Training and Research (SVNIRTAR) has released a regular job notification for various posts, including Typist/Clerk, General Duty Medical Officer, Lecturer, and Demonstrator. Eligible candidates who have passed 12th class or hold relevant degrees can apply online. The application process is currently open. SVNIRTAR Recruitment 2026 Organization Name Swami Vivekanand … Read more

నిర్మల్: కాంగ్రెస్ సర్పంచ్ సూసైడ్.. కారణం ఇదే..?

మన పత్రిక, TG క్రైం: పల్లె ప్రజల మద్దతుతో సర్పంచిగా ఎన్నికైన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబ తగాదాల కారణంగా మనోవేదనకు గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం నిర్మల్ జిల్లా కండెం మండలం మాసాయిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట సర్పంచి దుర్గం లహరిక (31) ఇంటి వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే … Read more

ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్

మన పత్రిక: భాగ్యనగర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ వివరాలు వెల్లడించారు. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 5) ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు … Read more

TG: ఈ రోజు రాత్రి నుంచి మీసేవ బంద్

మన పత్రిక: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల సేవలను నిలిపివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనితో వివిధ అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లే ప్రజలకు సేవలు అందుబాటులో ఉండవు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తయ్యేందుకు సుమారు 36 గంటల సమయం పట్టనుంది. ఇదే సమయంలో శనివారం, … Read more

రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షాలు

మన పత్రిక, వాతావరణం: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది. శనివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, … Read more

నిర్మల్: పురుగు మందు తాగి సర్పంచ్ సూసైడ్

మన మత్రిక, TG క్రైం: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి దురదృష్టకర పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం లహరి పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు … Read more

40 ఏళ్ల అనుబంధం కట్.. కారెక్కనున్న జీవన్ రెడ్డి..?

మన పత్రిక, TG: తెలంగాణ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 13న ఆయన భారత్ రాష్ట్ర సమితి కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. ముందుగా ఈ నెల 7న జగిత్యాలకు వెళ్లనున్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఈ చర్చలు వేగం పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు … Read more

నారాయణపేట: చిన్నారి అపహరణ.. చెరువు కట్టపై శవమై ప్రత్యక్షం!

మన పత్రిక, తెలంగాణ, క్రైం: నారాయణపేట జిల్లాలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య కలకలం రేపింది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ (5) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై లభ్యమవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తేజశ్రీ తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లగా, చిన్నారిని తాతమ్మల వద్ద ఉంచారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని … Read more

యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన బంగారం ధరలు!

మన పత్రిక: యుద్ధ ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం నాటికి 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,970 వద్ద ట్రేడ్ కాగా, 22 క్యారెట్ బంగారం రూ.1,36,550, 18 క్యారెట్ బంగారం రూ.1,11,730 వద్ద నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 … Read more