నేటి బంగారం ధరలు ఇలా

మన పత్రిక: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 5) ఉదయం 6:30 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,350గా నమోదైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,51,080, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,500 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో … Read more

అల్లూరి జిల్లాలో రాత్రి భూప్రకంపనలు

మన పత్రిక, ఏపీ: మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించి ప్రజల్లో కలకలం రేపాయి. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి దాదాపు 30 సెకన్ల పాటు కంపించింది. ముఖ్యంగా అరకు వ్యాలీ, పాడేరు, పెడబయలు, హుకుంపేట ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనుభూతి అయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి లేచి భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణభయంతో … Read more

అడవి శేష్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ డెకాయిట్ విడుదలకు సిద్ధమైంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ ప్రారంభంలో శేష్, మృణాల్ మధ్య అందమైన ప్రేమకథను చూపిస్తూ పెళ్లి, కుటుంబం వంటి … Read more

రిలయన్స్ జియోకు ట్రాయ్ షాక్

మన పత్రిక: టెలికాం రంగంలో కీలక పరిణామంగా, నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. టారిఫ్ విధానాల్లో పారదర్శకత నిబంధనలు పాటించలేదని గుర్తించిన ట్రాయ్, వెంటనే మార్పులు చేయాలని సూచించింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు విధించింది. నివేదికల ప్రకారం, జియో రెండు కీలక అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రాయ్ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీ తన అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో టారిఫ్ ప్లాన్‌లను ఒకే … Read more

ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఈ నెల 2న అధికారికంగా ఈ మ్యాప్‌ను ప్రకటించింది. మొత్తం 28 జిల్లాలతో రూపొందించిన ఈ మ్యాప్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా చూపించారు. ఈ మ్యాప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం అమరావతి కు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల … Read more

బాసర మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, తెలంగాణ: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రణాళికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, భక్తుల సౌకర్యాలను … Read more

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి: హరీశ్ రావు

మన పత్రిక, రాజకీయం: గజ్వేల్‌లో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగినదేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా దీనిని అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో … Read more

శాలరీ రౌండ్ ట్రిప్పింగ్.. ఎమ్మెల్యే నాగమాధవిపై ఈసీకి ఫిర్యాదు

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: నెల్లిమర్ల రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లోకం నాగమాధవి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమెకు చెందిన ‘మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్’ సంస్థ ద్వారా 2024 ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఆనంద్, పక్కా సాక్ష్యాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు ప్రకారం … Read more

శంకరపల్లిలో వారణాసి సినిమా షూటింగ్

మన పత్రిక, సినిమా: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఇండియన్ సినిమాల్లో ‘వారణాసి’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శంకర్‌పల్లి ప్రాంతంలో జరుగుతోంది. … Read more

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

మన పత్రిక: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా బీజేపీ … Read more