ఆదిలాబాద్: CM వస్తుండు.. వరాలు కురిపించేనా..?

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బజార్‌హట్‌నూర్ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండటంతో కొత్త ప్రకటనలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. జిల్లాలో ప్రధాన సమస్యలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రవహించే పెన్‌గంగా … Read more

ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. 900 మంది పోలీసులతో బందోబస్తు

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం పిప్రి గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సభ నిర్వహించేందుకు ప్రత్యేక … Read more

జైలర్ 2లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్..?

మన పత్రిక, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ జైలర్- 2 ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్లు తలైవా స్వయంగా వెల్లడించారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రజినీకాంత్, “జైలర్ 2” చిత్రీకరణ త్వరలో పూర్తవుతుందని, విడుదల తేదీని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాను … Read more

AP: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగుల భయం!

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు ఉండగా, సాయంత్రానికి వర్షాలు, ఉరుములు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ … Read more

హైదరాబాద్: సైబర్ మోసం.. రూ.2.36 కోట్లు స్వాహా

మన పత్రిక, క్రైం: హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.2.36 కోట్లు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మోసం గతేడాది ఆగస్టులో ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన వీరభద్రరావు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ‘కోరా’ అనే పేరుతో Facebookలో ఒక గుర్తుతెలియని మహిళ పరిచయమైంది. తాను సింగపూర్‌కు … Read more

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

మన పత్రిక: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా యుద్ధ భయాలు, ఆర్థిక ఒత్తిళ్లు పెట్టుబడిదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అంతేకాకుండా అమెరికన్ డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభం కావడానికి ముందు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,90,000 వరకు ట్రేడ్ … Read more

ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

మన పత్రిక: నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో జరిగిన ఈ ఎన్నికలో అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. దీంతో … Read more

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. యువతి సూసైడ్

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్ క్రైం: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణ జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తెగేసి చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్ స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి … Read more

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వ్యభిచారం

మన పత్రిక, క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసుల నిత్య గస్తీ ఉండే ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉన్న మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిర్వాహకులు ఈ దందాను సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విటులతో ఒక … Read more

అర్ధరాత్రి తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం

మన పత్రిక: తెలంగాణలో శనివారం అర్థరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షాలు కురిసి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోనూ వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పలుచోట్ల వర్షం పడడంతో రోడ్లపై నీరు నిలిచింది. … Read more