సౌందర్య మరణానికి ముందురోజు ఏం జరిగింది? అనుకోకుండా రికార్డయిన ఆ ఫోన్ కాల్ ఏం చెప్పింది?

మన పత్రిక, వెబ్​డెస్క్: సినీ నటి సౌందర్య మరణం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే ఉంటుంది. 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదానికి రెండు రోజుల ముందు (ఏప్రిల్ 15, 2004) జరిగిన ఓ సంఘటన, అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అప్పట్లో బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజా టీవీకి … Read more

కేసీఆర్, హరీష్‌లే టార్గెట్.. ఉరితీసినా తప్పులేదంటూ ఫైర్!

మన పత్రిక, వెబ్​డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) చుట్టూ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీష్ రావు చేసిన ‘జల ద్రోహం’పై ‘సిట్’ (SIT – Special Investigation Team) విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఆరోపణలు – సిట్ విచారణకు కారణాలు: హరీష్ రావు కౌంటర్ … Read more

నీటి వాటాల్లో రాజీపడేదే లేదు: గత పాలకుల పాపాలివే.. అసెంబ్లీలో లెక్క తేలుస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) అనంతరం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలివే:

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్.. 70% సబ్సిడీతో గేదెల పంపిణీ

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు. భారీ సబ్సిడీ: ఈ పథకం కింద … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 జనవరి 2026 Horoscope in Telugu

గ్రహాల సంచారం, నక్షత్ర బలం ఆధారంగా దినఫలాలు మారుతుంటాయి. ఈరోజు (శుక్రవారం) ఏ రాశి వారికి కాలం కలిసి వస్తుంది? ఎవరికి ధనలాభం ఉంది? ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృథా చేయవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. మీ … Read more

ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కారణం ఇదే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే యముడిగా మారి ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మృతులను కావ్య (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. … Read more

Drunk and Drive: న్యూ ఇయర్ రోజు 1198 కేసులు.. వాహనాలు సీజ్ 

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల జోష్‌లో నిబంధనలు మరిచిన మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా యువత మద్యం సేవించి రోడ్లపై చిందులు వేశారు. అర్ధరాత్రి దాకా రోడ్లపై హల్చల్ చేస్తూ, పోలీసు ఆంక్షలను బ్రేక్ చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల భరతం పట్టారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టారు. కేవలం హైదరాబాద్ … Read more

TG News: రూ.5 వేల కోట్ల అమ్మకాలు, సర్కార్‌కు కాసుల వర్షం

మన పత్రిక, వెబ్​డెస్క్: కొత్త సంవత్సరం (2026) వేడుకల సందర్భంగా తెలంగాణలో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులతో పాటు వైన్ షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ప్రభుత్వం కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వడంతో విక్రయాలు జోరుగా సాగాయి. న్యూ ఇయర్ జోష్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు … Read more

న్యూ ఇయర్ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి, 15 మంది సీరియస్

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకలు విషాదాంతమయ్యాయి. భవానినగర్‌లో బుధవారం రాత్రి 17 మంది స్నేహితులు కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి, బిర్యానీ తిన్నారు. విందు ఆరగించిన కాసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మిగిలిన 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి … Read more

డీజీపీ ఆసక్తికర రియాక్షన్.. వైరల్ అవుతున్న సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల చరిత్రలో ‘కత్తుల సమ్మయ్య’ది ఓ ప్రత్యేకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. నక్సలైట్లకు కోవర్టుగా మారి, పోలీసులకు సహకరించి, పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన సమ్మయ్య ఉదంతం అప్పట్లో సంచలనం. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేముల సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీజీపీ రియాక్షన్: నిన్న ఓ జర్నలిస్ట్ కత్తుల సమ్మయ్య … Read more