మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకలు విషాదాంతమయ్యాయి. భవానినగర్లో బుధవారం రాత్రి 17 మంది స్నేహితులు కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి, బిర్యానీ తిన్నారు.
విందు ఆరగించిన కాసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మిగిలిన 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ లేదా కల్తీ మద్యం కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
