HYD: పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది

మన పత్రిక, క్రైం: రెండో వివాహం చేసుకున్న భర్త వేధింపులను భరించలేక ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి(30) ప్రేమ వివాహం చేసుకుని మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివసిస్తున్నారు. వీరికి కార్తిక్(12), కౌశిక్(10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రవీణ్ భవన … Read more

‘రామాయణ’ టీజర్‌కు సెన్సార్ క్లియరెన్స్

మన పత్రిక, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.3000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ ఇవ్వడం విశేషంగా మారింది. ‘రామ’ పేరుతో రాబోతున్న … Read more

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర ఎంతంటే..?

మన పత్రిక: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం, డాలర్ మార్పిడి విలువల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో పసిడి ధరలు రోజువారీగా మార్పులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు ₹14,500 నుంచి ₹16,300 మధ్య కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర ₹13,300 నుంచి ₹15,500 వరకు ఉంది. విజయవాడలో … Read more

ఖాతాదారులకు అలర్ట్.. నేడు బ్యాంకు సేవలు బంద్

మన పత్రిక: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య అలర్ట్ జారీ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఇవాళ బ్యాంక్ బ్రాంచ్ సేవలు నిలిపివేయనున్నారు. బ్యాంకులు ఓపెన్‌గా ఉన్నప్పటికీ, ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు. వార్షిక ఖాతాల ముగింపు, లెక్కల సరిపోలిక వంటి కీలక పనులను పూర్తి చేయాల్సి ఉండటంతో సిబ్బంది పూర్తిగా అంతర్గత కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. ఈ కారణంగా నగదు జమ, విత్‌డ్రాయల్ వంటి సేవలు బ్రాంచ్‌లలో అందుబాటులో ఉండవు. అయితే … Read more

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

మన పత్రిక: ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే గత నెలలోనే రూ.115 పెంపు జరిగిన విషయం తెలిసిందే. వరుస పెరుగుదలలతో హోటళ్లు, చిన్న వ్యాపారులపై భారం మరింత పెరుగుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తడంతో ధరలు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల … Read more

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య, కొడుకును చంపేశాడు

మన పత్రిక, క్రైం: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసి ఇద్దరిని హతమార్చాడు. ఈ సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బాణావత్ రాందాస్ అనే వ్యక్తి ప్రతిరోజులాగే సోమవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య కవితతో వాగ్వాదం తలెత్తింది. క్షణికావేశంలో అదుపుతప్పిన రాందాస్ కత్తితో భార్యతో … Read more

HYD: ‘పెద్ది’ మరోసారి వాయిదా..?

మన పత్రిక, సినిమా: పెద్ది విడుదలపై మరోసారి గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో ఈ సినిమా జూన్ 26కు వాయిదా పడిందన్న ప్రచారం జోరుగా సాగింది. నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జూన్ 26న చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయాలని భావించామని, అయితే అదే రోజున ‘పెద్ది’ రిలీజ్ ఉందని తెలుసుకుని తమ సినిమా తేదీని వాయిదా వేసుకున్నామని చెప్పారు. అయితే తర్వాత ఎస్కేఎన్ … Read more

AP: హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు

మన పత్రిక, క్రైం: విశాఖ గాజువాకలో సోమవారం మహిళ హత్య ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సౌత్‌ ఏసీపీ వై. శ్రీనివాసరావు, సీఐ అళహరి పార్థసారథి వెల్లడించారు. పాతగాజువాక ఎల్‌వీ నగర్‌లో నివసిస్తున్న ఇండియన్‌ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ చింతాడ రవీంద్ర (30) 2021లో డేటింగ్‌ యాప్ ద్వారా తాటిచెట్లపాలెం సంజీవయ్యకాలనీకి చెందిన పి. మౌనిక (31)తో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం 2024లో మరో మహిళను వివాహం చేసుకున్నప్పటికీ మౌనికతో సంబంధం కొనసాగించాడు. … Read more

TG: ఏప్రిల్ 4న క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

మన పత్రిక, రాజకీయం: క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం (మార్చి 30) ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 4, 2026న ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న ఫలితాలు … Read more

ఉత్తరప్రదేశ్‌: విడాకులు వచ్చిన సంతోషంలో సాష్టాంగ యాత్ర

మన పత్రిక, వైరల్: ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన వినూత్న మొక్కు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దాంపత్య బంధం సుఖంగా కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తారు. కానీ బస్తీ జిల్లాకు చెందిన యోగేష్ మాత్రం తన వివాహ బంధం ముగియాలని కోరుకున్నాడు. భార్యతో వచ్చిన విభేదాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అతడు, విడాకులు మంజూరైతే ఆలయానికి ‘దండవత్ యాత్ర’ చేస్తానని మొక్కుకున్నాడు. 2022లో వివాహం అయిన కొద్ది కాలానికే దాంపత్య జీవితం కలతలు చెంది, … Read more