మన పత్రిక, రాజకీయం: క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం (మార్చి 30) ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 4, 2026న ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడగా, అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుని ఆధిపత్యం చాటింది.
అయితే క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో కొన్ని పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
