ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.567 కోట్ల నిధులు విడుదల

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిధులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ. 2,600 కోట్ల గ్రాంట్‌ను పూర్తిస్థాయిలో సాధించిందని మంత్రి తెలిపారు. నిధుల … Read more

సంక్రాంతి వేళ కన్నీటి విషాదం: కాలిబూడిదైన గిరిజన తండా..

మన పత్రిక వెబ్​డెస్క్, కాకినాడ: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు ఊరు ఊరంతా కాలిబూడిదైంది. ఈ ఘటనలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి … Read more

టెన్షన్ టెన్షన్.. జనవరి చివరి నాటికి సిట్ ఛార్జిషీట్! అరెస్టుల లిస్ట్‌లో ఎవరు?

మన పత్రిక వెబ్​డెస్క్, తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ (SIT) దూకుడు పెంచింది. ఏడాదికి పైగా కొనసాగుతున్న ఈ దర్యాప్తు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ కేసులో మరో కీలక ముందడుగు వేస్తూ, జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు కోర్టులో దాఖలు ఇప్పటికే ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల … Read more

ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. వాట్సాప్‌లోనే అన్ని సేవలు!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సేవల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అరచేతిలోనే అన్ని పనులు అయిపోయేలా చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మాన్యువల్ సేవలకు చెక్.. అంతా ఆన్‌లైనే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన … Read more

Yandamoori Veerendranath : హద్దుమీరిన యండమూరి.. ఈ వయసులో అవసరమా?

Yandamoori Veerendranath Controvercy words in public meeting

తెలుగు రచయితలలో ఎంతో పేరున్న నవలా రచయిత “యండమూరి వీరేంద్రనాథ్”(Yandamoori Veerendranath). “తులసిదళం” (Tulasidalam) నవలతో ఫేమస్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ చలన చిత్ర రంగంలోనూ రాణించారు. ఆయన రచించిన పలు నవలలను సినిమాలుగా తెరకెక్కించారు డైరెక్టర్లు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఓ నవలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిరంజీవి (Chiranjeevi) “అభిలాష”, ఛాలెంజ్, రాక్షసుడు వంటి చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ప్రజాదరణ తెచ్చుకున్నాయి. అంతే కాదు యువతకు సందేశాలిస్తూ పలు వ్యక్తిత్వ … Read more

ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో ఆ జిల్లా దశ తిరిగినట్లే!

మన పత్రిక వెబ్​డెస్క్, నెల్లూరు: నెల్లూరు నగర రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, నగర అభివృద్ధికి బాటలు వేసేలా కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు చుట్టూ దాదాపు రూ.1,930 కోట్ల భారీ వ్యయంతో 83.64 కిలోమీటర్ల మేర ‘ఔటర్ రింగ్ రోడ్డు’ (ORR) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎక్కడ మొదలై.. ఎక్కడ వరకు? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల … Read more

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విజయవాడలో జరుగుతూ వచ్చిన స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలను ఈసారి నుంచి రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) రాజధాని ముస్తాబవుతోంది. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ రాజధానిలోని మంత్రుల బంగ్లాలకు ఎదురుగా ఉన్న 10 ఎకరాల సువిశాల స్థలంలో పరేడ్ గ్రౌండ్‌ను సీఆర్డీఏ … Read more

రాజకీయాలు మనవి కావు.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పాలనలో అనుసరించాల్సిన విధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న దౌర్జన్య రాజకీయాలకు టీడీపీ పూర్తి భిన్నమని, బెదిరింపులు, ‘రప్పా రప్పా’ సంస్కృతి తమకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రజాసేవే మన అజెండా ఎన్నికల్లో గెలిచామా లేదా … Read more

2,419 బస్సులు బంద్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి బిగ్ షాక్..

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ (Sankranti) రద్దీ మొదలైన వేళ ఏపీఎస్ఆర్టీసీకి, ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పండుగ కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించిన ఆర్టీసీకి.. అద్దె బస్సుల యజమానుల నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు 2,419 అద్దె బస్సుల యజమానులు హెచ్చరిస్తున్నారు. పండుగ సమయంలో అత్యంత కీలకమైన అద్దె బస్సులు నిలిచిపోతే గ్రామీణ, పట్టణ ప్రాంత … Read more

Polavaram Project: డిసెంబర్ 2027 నాటికి పూర్తి – సీఎం చంద్రబాబు

మన పత్రిక వెబ్​డెస్క్, పోలవరం: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, భద్రతా చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న అడ్డంకులను దశలవారీగా తొలగించి, పనులను తిరిగి గాడిలో పెట్టామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 87 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు … Read more