ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!

ACb arrest yadagirigutta

ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి ఇంజనీర్.. రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్! మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం (yadagirigutta temple) సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావు లంచం కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ దుకాణంలో ఆయన్ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రామారావును ఏసీబీ అధికారులు యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ఆయనకు చెందిన పలు ఆస్తులు, … Read more

Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!

nalgonda gurrampode bike accident anusha

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో దారుణ ప్రమాదం జరిగింది. శేషిలేడివాగు బ్రిడ్జిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చామలేడు గ్రామానికి చెందిన సిలువేరు నవీన్ (25), అతని భార్య అనుష (21) తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వేగానికి అనుష బ్రిడ్జి పైనుంచి ఎగిరి ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. స్థానికులు 15 నిమిషాల తర్వాత ఆమెను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను, తీవ్ర గాయాలపాలైన భర్త నవీన్‌ను … Read more

TG Inter: ఇంటర్ ఫలితాలు నేడే

Open 10th and Intermediate public exams result today

మన పత్రిక, వెబ్​డెస్క్: (open 10th result 2025) తెలంగాణ రాష్ట్ర ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 30) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఓపెన్ స్కూల్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. గత సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఈ పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా పొందవచ్చని … Read more

Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు

Telangana school news today rain

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు (అక్టోబర్ 30, 2025) సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థలన్నిటికీ ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, కరీంనగర్ … Read more

Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!

devarakonda mandal

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ (cyclone montha) కారణంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య 108 సిబ్బంది సాహసం చేశారు. దేవరకొండ మండలం (Devarakonda mandal) మడమడక గ్రామానికి చెందిన జట్టి దేవి అనే నిండు గర్భిణీకి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు 108కి కాల్ చేయగా, చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు సంఘటనా స్థలానికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోని మైనంపల్లి వాగు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో … Read more

Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక

warangal rain holiday news

మన పత్రిక, వెబ్​డెస్క్: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రేపు (అక్టోబర్ 30, 2025) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలవు ప్రకటించిన కారణంగా, రేపు జరగాల్సిన SA-1 (సమ్మేటివ్ అసెస్‌మెంట్-1) పరీక్షలు కూడా … Read more

Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!

Nalgonda rain news

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకొండ కోమ్మెపల్లిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, సిబ్బంది పాఠశాలకు చేరుకుని వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప … Read more

Karimnagar | డాక్టర్ ఆత్మహత్య.. క్రిప్టో మోసమే కారణమా?

karimnagar doctor news

మన పత్రిక, వెబ్​డెస్క్: మృతుడు మంకమ్మతోటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ( Doctor srinivas ) , గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భర్త ఆత్మహత్యపై డాక్టర్ విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్, కిరణ్, గణేష్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్త ‘మెటా ఫండ్’లో డబ్బులు పెట్టారని, వారికి కోట్లలో డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. వైద్యవృత్తిలో ఉండటంతో శ్రీనివాస్ … Read more

High Alert: మరో 3 గంటల్లో భారీ వర్షం, జిల్లాలకు హెచ్చరిక!

telangana heavy rain alert next 3 hours montha cyclone

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో భారీ వర్షం, ఈ జిల్లాలకు హెచ్చరిక! మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు ( Cyclone in telangana ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మరో మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, హనుమకొండ, జనగాం, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగా … Read more

Collector: వర్షంలో ధాన్యం కేంద్రం తనిఖీ.. రైతులకు నల్గొండ కలెక్టర్ సూచన!

nalgonda collector ila tripathi inspects koppole paddy

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉదయం కురుస్తున్న వర్షంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు, నిర్వాహకులకు కీలక సూచనలు జారీ చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయకుండా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు వహించాలని … Read more