మన పత్రిక, వెబ్డెస్క్: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రేపు (అక్టోబర్ 30, 2025) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఈ మేరకు డీఈఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలవు ప్రకటించిన కారణంగా, రేపు జరగాల్సిన SA-1 (సమ్మేటివ్ అసెస్మెంట్-1) పరీక్షలు కూడా వాయిదా పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
