బిగ్ అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్! ఈ ఏరియాల్లోనే..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరవాసులకు జలమండలి (HMWSSB) కీలక హెచ్చరిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 36 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుందని ప్రకటించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2లో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతుండటమే ఇందుకు కారణం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జలమండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 10వ తేదీ (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి జనవరి 11వ తేదీ (శనివారం) … Read more

సర్కార్ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’.. పిల్లలకు రవాణా సౌకర్యం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ (Pre-Primary) విద్యను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో … Read more

ఉపాధి హామీ రద్దుకు మోదీ కుట్ర.. అదానీ, అంబానీ కోసమే ఇదంతా

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. పేదల పాలిట వరమైన ఈ పథకాన్ని రద్దు చేసి, గ్రామీణ ప్రజలను మళ్లీ బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్పొరేట్ల కోసమే ఈ తతంగం గ్రామాల్లో … Read more

ప్రణయ్ హత్య కేసు: అమృత బాబాయ్‌కి బెయిల్..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు తనకు … Read more

బర్త్ డే పార్టీ విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

మన పత్రిక వెబ్​డెస్క్, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీకి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న విద్యార్థుల ప్రయాణం మృత్యుఒడిలో ముగిసింది. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీబీఏ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. మిర్జాగూడ గేట్ సమీపంలో అదుపుతప్పిన స్పోర్ట్స్ కారు చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. బర్త్ డే వేడుకల అనంతరం.. … Read more

అమెరికాలో హత్యకు గురైన నిఖితా మృతదేహం హైదరాబాద్ కు.. నిందితుడు అరెస్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖితా గోదిశాల (27) మృతదేహం నేడు (జనవరి 8) నగరానికి చేరుకోనుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో విదేశాంగ శాఖ అన్ని అనుమతులు జారీ చేసిందని, బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. నిఖితా తన మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ చేతిలో న్యూ ఇయర్ ఈవ్ రోజున దారుణంగా హత్యకు గురైంది. … Read more

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు.. జనవరి 16న కీలక ఘట్టం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా ముగించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం … Read more

Sankranti: స్పెషల్ బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీల పెంపు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) షాక్ ఇచ్చింది. పండుగ రద్దీ కోసం ఏర్పాటు చేసిన 6,431 ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను సాధారణం కంటే 1.5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు జనవరి 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే కొనసాగుతాయి. మహిళలకు … Read more

కవిత కుట్రలు: కేటీఆర్‌పై అక్కసు ఎందుకు? వైరల్ పోస్ట్ కలకలం

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమయ్యేలా ‘కవిత కుట్రలు – పార్ట్ 1’ పేరుతో ‘ఉత్తమ్ బీఆర్ఎస్’ రాసిన ఓ ఆసక్తికరమైన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూనే.. ఎమ్మెల్సీ కవిత తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్న కేటీఆర్‌పై కవిత ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారనే కోణంలో ఈ కథనం సాగింది. కేటీఆర్ విజయాలు vs కవిత ఓటమి 2009 … Read more

Dharani Portal Refund | 87 కోట్లు పెండింగ్.. రైతులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న రైతులకు తిరిగి ఇవ్వాల్సిన స్టాంప్ డ్యూటీ సొమ్మును రెవెన్యూ శాఖ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టింది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 26,740 మంది రైతులకు సంబంధించిన రూ. 87.60 కోట్లను ప్రభుత్వం తన వద్దే అట్టిపెట్టుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు … Read more