Akhanda 2: బాలయ్య శివతాండవం.. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్

మన పత్రిక, వెబ్​డెస్క్: ‘అఖండ’ విజయంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’లో (Akhanda 2) బాలయ్య తనదైన శైలిలో నట విశ్వరూపం చూపించారు. సినిమా మొత్తం బాలయ్య ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అఖండ పాత్ర ప్రవేశించిన తర్వాత థియేటర్లలో పూనకాలు తెప్పించే రేంజ్‌లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అఘోరా గెటప్‌లో బాలయ్య లుక్, నడవడిక, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు … Read more

Nalgonda: 21 ఏళ్ల యువతి సర్పంచ్ అయింది…

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో (Nalgonda District) ఓ యువతి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన బోయపల్లి అనూష (21) ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం సాధించినప్పటికీ, ప్రజాసేవపై మక్కువతో ఆ కార్పొరేట్ ఆఫర్‌ను తిరస్కరించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. బీఆర్ఎస్ (BRS) మద్దతుతో పోటీ చేసిన అనూష, సీనియర్ నాయకురాలిపై 182 ఓట్ల మెజార్టీతో ఘన … Read more

తెలంగాణ బీజేపీలో కలకలం… ఎంపీల మధ్య సమన్వయ లోపంపై చర్చ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినప్పటికీ, వారి మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో పార్టీ తీరుపై క్యాడర్ అయోమయానికి గురైంది. అధిష్టానం రాష్ట్ర రాజకీయాలను అంచనా వేయడంలో, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమవుతోందనే వాదనలు ఉన్నాయి. ఎంపీల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర పార్టీలతో … Read more

TGSEB: టెన్త్, ఇంటర్ బోర్డుల విలీనం!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి, ఇకపై ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’ పేరిట ఒకే బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ రైజింగ్ విజన్’ డాక్యుమెంట్‌లో ఈ కీలక అంశాన్ని పొందుపరిచారు. దేశంలో ప్రస్తుతం కేవలం 6 రాష్ట్రాల్లోనే టెన్త్, ఇంటర్ లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ … Read more

లోయలో పడ్డ యాసిడ్ లారీ.. డ్రైవర్ మృతి.

మన పత్రిక, వెబ్​డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కాకినాడ నుంచి పాల్వంచకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న భారీ లారీ, పాములేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అయితే లారీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర … Read more

AP Kaushalam Exam New Schedule 2025: మిస్ అయిన వారికి గోల్డెన్ ఛాన్స్.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాంకేతిక కారణాలతో ‘కౌశలం’ (Work From Home Job Skill Test) పరీక్ష రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 12, 2025 వరకు పరీక్షలు నిర్వహించేలా రీ-షెడ్యూల్ విడుదల చేసింది. ఎవరికి అర్హత? మొదటి విడతలో సర్వర్ సమస్యలు, లాగిన్ ఇబ్బందులు లేదా వ్యక్తిగత కారణాల వల్ల పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష రాయవచ్చు. సొంత గ్రామ/వార్డు సచివాలయాల్లోనే … Read more

Today Gold Prices: బంగారం ధరలు తగ్గుదల – తాజా గోల్డ్ రేట్స్

December 10 Gold Prices

Gold price news: హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుస పెరుగుదల తర్వాత చివరకు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కరోజే రూ.300 వరకు పడిపోయిన పసిడి ధరలు, డిసెంబర్ 10న (December 10 Gold Prices) మరింత తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. ఇటీవల తులం ధర రూ.1,30,430 ఉండగా, ప్రస్తుతం దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి ఈక్విటీ మార్కెట్లకు మళ్లడంతో ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ తాజా … Read more

పోస్టల్ శాఖ బంపర్ ఆఫర్.. రూ. 750కే రూ. 15 లక్షల బీమా

postal department insurance

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యులకు తపాలా శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. అత్యంత తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఖమ్మంలో జరిగిన అవగాహన సదస్సులో పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రధానంగా గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ కింద కేవలం రూ. 750 చెల్లిస్తే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే రూ. 550 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా సౌకర్యం … Read more

ఎన్నికల సిబ్బందికి గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన రెమ్యూనరేషన్!

telangana polling staff remuneration hike 2025 panchayat elections

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలింగ్ సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్‌ (REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025) ను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఈ పెరిగిన చెల్లింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి టి.ఏ (TA), డి.ఏ (DA) మరియు ఇతర … Read more

TG News: తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం

Telangana Rising Global Summit 2025

తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం: సీఎం రేవంత్ రెడ్డి మన పత్రిక, వెబ్​డెస్క్: మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) తొలిరోజు ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. … Read more