మన పత్రిక, హాలియా: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ హెచ్చరించారు. మంగళవారం హాలియా పట్టణంలో మైనర్ డ్రైవింగ్ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు నడుపుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ.. సరైన అవగాహన లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు రూ. 25,000 వరకు భారీ జరిమానా విధించడంతో పాటు, ఆ వాహన రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దని, వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎస్ఐ సూచించారు. కాగా, పట్టుబడిన మైనర్లను పోలీస్ స్టేషన్కు తరలించి, వారికి ఎస్ఐ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
