కోనసీమ జిల్లాలో డీజే సౌండ్‌కి ఒకరు బలి..

మన పత్రిక, వెబ్​డెస్క్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ(Konaseema) జిల్లాలోని చిన్నగాడవిల్లి గ్రామంలో గణపతి నిమజ్జనం సందర్భంగా విషాదం నెలకొంది. డీజే సౌండ్‌కు(DJ Sound) డ్యాన్స్ చేస్తూ గుత్తుల ప్రసాద్ (37) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఊహించని ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిమజ్జనం సందర్భంగా ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

పవన్ కళ్యాణ్ అరకులో పర్యటన

మన పత్రిక, వెబ్​డెస్క్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో ఆయన గిరిజనుల సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారు. ఈ ఉత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుంది. గత నెల 25న ప్రారంభమైంది. గిరిజనుల ప్రత్యేక ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ కళ్యాణ్ హాజరవుతారు.మాడగడ గ్రామం … Read more

Current affairs 3 September 2025 in telugu: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 3, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 3, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. కాషాళ్య డ్యామ్ ఉన్న రాష్ట్రం ఏది?హర్యానా పంజాబ్ లో ఘగ్గర్ నది ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉంటుంది?మాల్వా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయే ప్రమాదం ఉన్న సముద్ర ప్రవాహం ఏది? ఎఎంఓసి స్పెయిన్ లో బ్లూ డ్రాగన్స్ … Read more

KAVITHA SUSPENDED: పార్టీ నుంచి సస్పెండ్

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పేర్కొంది. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని కవిత నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ లోపల తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ … Read more

AP సెంట్రల్ జైళ్లలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్‌మెన్ ఉద్యోగాలు 2025

AP Prisons Department Pharmacist Lab Technician & Wireman Job Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు సెంట్రల్ జైలులో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్‌మెన్ పోస్టులను APCOS ద్వారా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. పోస్టులు & జీతం అర్హతలు వయస్సు పరిమితి (01-08-2025 నాటికి) దరఖాస్తు విధానం చిరునామా:సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ జైలు, కాకుతూరు, నెల్లూరు – 524320 సంప్రదింపు: 9985195894, 9676096089 Nellore Notification Pdf Visakhapatnam Notification Pdf … Read more

CDFD ఉద్యోగాలు 2025: 10th తో ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం

CDFD Recruitment Junior Assistant 2025 – సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD), హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్-II మరియు స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II పోస్టుకు కేవలం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) … Read more

తెలంగాణలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ సిద్ధం

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా విధానం (TEP) రూపకల్పనకు సిద్ధమైంది. తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అనుగుణమైన ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ పాలసీ రూపకల్పనకు గాను ప్రభుత్వ అడ్వైజర్ కె. కేశవరావు నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) ని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర అవసరాలకు … Read more

కవిత కొత్త పార్టీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి!

మన పత్రిక, వెబ్​డెస్క్ BRS ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ పార్టీని దీపావళి సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ పేరును బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తీసుకుని ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ (TBRS) గా పెట్టే అవకాశం ఉందని సమాచారం. బీసీ సమాజం ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ ప్రారంభం కానుంది. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్లో … Read more

తల్లికి వందనం: ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్ వినుకొండ: తల్లికి వందనం పథకం ( Thalliki Vandanam ) కింద డబ్బులు అందని వారి ఫిర్యాదులపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీరియస్ అయ్యారు. సోమవారం సిద్ధార్థ నగర్ లో పర్యటించిన సమయంలో పలువురు మహిళలు తమకు నిధులు రాలేదని జీవికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవి, మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. సర్వే పూర్తిగా ఎందుకు చేయలేదని నిలదీశారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. … Read more

ఆఫ్ఘనిస్థాన్‌లో పెరుగుతోన్న మృతుల సంఖ్య

మన పత్రిక, వెబ్ డెస్క్ : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Earthquake) కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా మరణించగా, 2,000 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి వేళ సంభవించిన ఈ భూకంప కేంద్రం జలాలాబాద్‌ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈదురుగాలులకు తట్టుకోలేని … Read more