Suryapet : జడ్పి సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్: కలెక్టర్ ఉత్తర్వులు

మన పత్రిక, సూర్యాపేట: పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్.కె. మెయినోద్దీన్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో ఆధారాలతో సహా రుజువు కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన పరిధిలోని పలువురు పంచాయతీ … Read more

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల విజయకేతనం

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడకు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో ఎంపీసీ విభాగానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించి ఏకంగా రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. ఎంపీసీ విభాగంలో శ్రావణి 468 మార్కులు, అంజన 468 మార్కులు, చంద్రలేఖ 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. అదేవిధంగా హన్సిక 467, అక్షిత 467, వాణి 467 … Read more

నల్లబండగూడెంలో ఉపాధి హామీ పనుల్లో కుప్పకూలి కూలీ మృతి

మన పత్రిక, కోదాడ: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన వేముల పుల్లమ్మ (56) అనే మహిళా కూలీ శుక్రవారం పని స్థలంలోనే ఆకస్మికంగా మృతి చెందింది. రోజువారీ మాదిరిగానే ఉదయం కరువు పనికి వెళ్లిన ఆమె, తోటి వారితో కలిసి పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఉపాధి హామీ కూలీ మృతి చెందిన విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న … Read more

TG Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి గానూ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు జూన్ 11న అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో నేరుగా మార్కులను తనిఖీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘TS Inter … Read more

Suryapet : ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..

మన పత్రిక, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఈటూరు గ్రామంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగస్వామి (33) గ్రామం నుంచి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో లింగస్వామి తలకు బలమైన గాయమైంది. … Read more

NEET UG 2026 : నీట్​ యూజీ రీ-ఎగ్జామినేషన్​కి భారీ భద్రత!

మన పత్రిక: జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, త్వరలో అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో దేశంలోని 551, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. గతంలో పేపర్ … Read more

Peddi : వీకెండ్ బ్లాస్ట్ పెద్ది @250కోట్లు… ఇక మీదుంటది అసలు సవాల్!

Peddi Movie Crossed 250cr mark at box office

రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఫైనల్ గా జూన్ 4న థియేటర్లలో విడుదలై సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ వీకెండ్ లో భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఫస్ట్ డే నే పెద్ది మూవీ 120 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, పెద్ది నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో 250 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ … Read more

School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక: Telangana రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13వ తేదీన రెండో శనివారం, అలాగే 14వ తేదీన ఆదివారం వరుసగా సెలవు దినాలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలవుల సర్దుబాటులో … Read more

కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

మన పత్రిక, కోహెడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో రూ.2,300 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 240 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. పండ్ల మార్కెట్‌తో పాటు అదే ప్రాంగణంలో … Read more

Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…

Peddi Advance Bookings Rocks at Box Office

మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న పెద్ది (Peddi) పై టాలీవుడ్ లో ఏ స్థాయి అంచనాలున్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొన్న ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి అదేమీ అడ్డుకానట్టు పెద్ది సినిమాకు భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మొన్నటివరకు IPL ఇంపాక్ట్ వల్ల సినిమా గురించి ఎవరు పట్టించుకోరు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఐపీఎల్ ముగిశాక లెక్కలన్నీ మారిపోయాయి. పెద్ది విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ఓవర్సీస్ … Read more