Advertisement

పార్లమెంటు సమావేశాల వేళ రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు

మన పత్రిక: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభలు సజావుగా సాగాలని ఆకాంక్షించిన ఆయన, ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో గందరగోళానికి తావులేకుండా అర్ధవంతమైన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం మరియు పార్లమెంటు సమావేశాలు రెండూ చురుగ్గా ఉంటేనే దేశం సుభిక్షంగా, సంక్షేమంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారతీయ అంతరిక్ష రంగ స్టార్టప్ స్కైరూట్ సాధించిన ‘విక్రమ్-1’ ప్రయోగ విజయాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ ఆవిష్కర్తలు ఈ అద్భుత ఘనత సాధించారని ఆయన ప్రశంసించారు. అనంతరం రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ, “స్కైరూట్ స్టార్టప్ బృందం సగటు వయసు 28 ఏళ్లని నాకు తెలిసింది. ఇక్కడ నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Advertisement
Advertisement