TG News: రైతులకు ఎకరానికి ₹9,600 సబ్సిడీ!

telangana vegetable farmers subsidy 9600

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana) కూరగాయలు సాగు చేసే రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించి, సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి ₹9,600 చొప్పున సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఒక ఎకరా కూరగాయల సాగుకు సుమారు ₹24,000 ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, అందులో 40% (అనగా ₹9,600) నిధులను సబ్సిడీగా అందించనుంది. ఈ పథకం … Read more

Chevella Bus Accident : చేవెళ్ల రోడ్డు విస్తరణ ఎందుకు ఆలస్యం అయింది?

supreme court road safely committee questions Telangana govt

Chevella Bus Accident : చేవెళ్ల రోడ్డు విస్తరణకు ఎందుకు ఆలస్యం అయింది? అని సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎందుకు ఎక్కించారు.. బస్సుల సంఖ్య ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించింది. చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ కోసం సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ హైదరాబాద్ చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులతో … Read more

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలు

telangana schools computer teacher 2837 jobs

ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ ఉద్యోగాలు — రూ.15 వేల వేతనంతో టీచర్ నియామకాలు త్వరలో తెలంగాణలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న ప్రభుత్వ పాఠశాలలు 2,837గా గుర్తించబడ్డాయి. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవడానికి, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ప్రభుత్వం టీచర్ల నియామకానికి సన్నద్ధమవుతోంది. కొత్తగా నియమించబడే కంప్యూటర్ టీచర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వేతనం సంవత్సరం లో 10 నెలలపాటు సమగ్ర శిక్ష నిధుల … Read more

Gold Rates 07 Nov 2025 : 07 నవంబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

07 November 2025 Friday today gold rates in telugu

Gold Rates 07 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 07 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,258 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,236 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,194 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.165.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 07 Nov 2025 : 07 నవంబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

07 November 2025 Friday today horoscope in telugu

Today Horoscope : 07 నవంబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                   వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. … Read more

Ramoji Group Foundation Day : రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే వేడుకలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Eenadu md kiran invites cm revanth for ramoji foundation day celebrations

Ramoji Group Foundation Day : రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈనెల 16న ఈ వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించబడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ ను రామోజీ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ సీహెచ్ కిరణ్ కలిశాను. ఈసందర్భంగా సీఎం రేవంత్ ను వేడుకలకు హాజరు కావాలని కిరణ్ ఆహ్వానించారు.

Olluru Royal Lake : తెగిన చెరువు కట్ట.. మునిగిన గ్రామం

flood waters surge into kalaaturu in Tirupati dist

Olluru Royal Lake : ఓ చెరువు తెగి గ్రామం మొత్తం మునిగిపోయింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో ఉన్న ఒళ్లూరు రాయల్ అనే చెరువుకు గండిపడింది. దీంతో చెరువు పక్కనే ఉన్న కళత్తూరు అనే గ్రామం నీట మునిగింది. ఒక్కసారిగా వరద గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అందరూ ప్రాణభయంతో ఇళ్లపైకి ఎక్కారు. ఈనేపథ్యంలో వరద నీటికి పశుపక్ష్యాదులు కొట్టుకుపోయాయి.

Chevella Road : చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని దర్నా.. 25 మందిపై కేసు నమోదు

case registered on people for dharna demanding repair of chevella road

Chevella Road : చేవెళ్ల రోడ్డు మీద రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా… ఆ రోడ్డు మాత్రం బాగుపడటం లేదు. ఇటీవల జరిగిన చేవెళ్ల రోడ్డు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అందుకే చేవెళ్ల రోడ్డును బాగు చేయాలని కొందరు యువకులు రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేశారు. దీంతో ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించి, అనుమతి లేకుండా ధర్నా చేశారని 25 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Chevella Bus Accident : ముగ్గురు కూతుళ్లకు కలిపి 21 లక్షల చెక్ తండ్రి ఎల్లయ్యకు అందజేత

compensation to 3 sisters who died in chevella bus accident

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసింది. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా ముగ్గురు అక్కచెల్లెళ్లకు గాను చొక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21 లక్షల చెక్కను తండ్రి ఎల్లయ్య గౌడ్ కు ప్రభుత్వం తరుపున అధికారులు అందజేశారు. నష్టపరిహారం అందుకుంటూ తండ్రి ఎల్లయ్య గౌడ్ తీవ్ర కంటతడి పెట్టాడు. నా ముగ్గురు … Read more

Bike Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు యువకులు మృతి

two youth die after speeding bike collides with lorry in bapatla

Bike Accident : ఏపీలోని బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లో చనిపోయారు. బాపట్లలోని గడియారం స్తంభం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చీరాల రూట్ నుంచి వస్తున్న లారీని సూర్యలంక రూట్ నుంచి వస్తున్న బైక్ అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద పడిపోయిన ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి … Read more