Hyderabad: కూకట్‌పల్లిలో నల్లచెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

మన పత్రిక, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని కూకట్‌పల్లిలో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నల్లచెరువును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు వద్ద గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నగరంలో రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా హైదరాబాద్‌ను మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైడ్రా … Read more

నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ఏప్రిల్‌లో రెండో విడత: మంత్రి పొంగులేటి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా (మార్చి 31) రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే గృహప్రవేశాల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’లో భాగంగా.. 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి … Read more

Gold Rate Today – March 8, ఆదివారం బంగారం ధరలు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పైకి కదిలాయి. ఆదివారం (మార్చి 8, 2026) నాటికి పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. గతంలో నమోదైన ఆల్-టైమ్ హై (రూ. 1,85,000) రికార్డుతో పోలిస్తే ఇంకా రూ. 22,100 తక్కువగానే ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములకు రూ. 516 మేర పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో నేటి (మార్చి 8) ధరలు: క్యారెట్ (10 గ్రాములు) ప్రస్తుత ధర 24 క్యారెట్లు … Read more

UK07 rider car accident | 150 కి.మీ వేగంతో కారు ప్రమాదం యూట్యూబర్ అనురాగ్ దోవల్..

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: uk07 rider accident news – ప్రముఖ మోటో వ్లాగర్ (UK07 Rider), బిగ్‌బాస్-17 మాజీ కంటెస్టెంట్ అనురాగ్ దోవల్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. శనివారం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉద్దేశపూర్వకంగా డివైడర్‌ను ఢీకొట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్ర గాయాలపాలైన అనురాగ్‌ను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం … Read more

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. లోన్ల ఈఎంఐల తగ్గింపు, ఎఫ్‌డీలపై వడ్డీ పెంపు!

మన పత్రిక వెబ్​డెస్క్ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. ఒకవైపు రుణ ఆధారిత వడ్డీ రేట్లను (MCLR) తగ్గిస్తూ సామాన్యులకు ఈఎంఐ భారాన్ని తగ్గించిన బ్యాంక్, మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచుతూ డిపాజిటర్లకు లాభం చేకూర్చింది. సవరించిన ఈ కొత్త రేట్లు నేటి (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చాయి. తగ్గనున్న ఈఎంఐ భారం (MCLR కోత) అన్ని … Read more

తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన.. | Gaddar Film Awards 2025 Announced

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ‘గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025’ (2024 సంవత్సరానికి గాను) విజేతల జాబితాను ప్రకటించింది. నంది అవార్డుల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి అక్కినేని నాగేశ్వరరావు, సి.నారాయణ రెడ్డి పేర్లతో కొత్త అవార్డులను ప్రవేశపెట్టడంతో పాటు, స్పెషల్ జ్యూరీ అవార్డులను 6 నుంచి 8కి పెంచారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి … Read more

Anuj Agnihotri UPSC | యూపీఎస్సీ టాపర్‌గా డాక్టర్ అనుజ్ అగ్నిహో

Anuj Agnihotri UPSC

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC TOPPER) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 6, 2026న యూపీఎస్సీ ప్రకటించిన తుది మెరిట్ జాబితాలో డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR 1) సాధించి సత్తా చాటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల కోసం నిర్వహించే ఈ కఠినమైన పరీక్షలో మొదటి స్థానం సాధించడం పట్ల … Read more

AP Local Body Elections : ఏపీ జడ్పీ ఎన్నికలపై పవన్ కీలక ప్రకటన.

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రాతిపదికనే జడ్పీ (ZPTC) ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన సభలో స్పష్టం చేశారు. గురువారం బడ్జెట్ పద్దులపై ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల పునర్విభజనపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటే ప్రతి మొక్కకు … Read more

Suryapet : వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వెలసిన ఆక్రమణలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి దుకాణాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో రోడ్లపైకి వచ్చిన షాపుల సామగ్రిని, మట్టి కుప్పలను క్లియర్ చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా … Read more

CM Revanth Reddy భారీ యాక్షన్ ప్లాన్.. 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి’!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2న గ్రామసభలతో ప్రారంభమై, జూన్ 2న … Read more