Advertisement

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కలకలం

మన పత్రిక, హైదరాబాద్: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు బయటకు వచ్చింది. తనపై ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఈ లేఖ సంచలనంగా మారింది. ఆ మహిళా అధికారిణి తన ఫిర్యాదులో ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధించడమే కాకుండా, అనుమతి లేకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్ నోట్‌లో ఏముంది?

రెండు పేజీల సూసైడ్ లేఖలో ఉదయ్ కృష్ణారెడ్డి పలు కీలక విషయాలను పేర్కొన్నారు. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణితో తాను ఏడాదిన్నర కాలంగా రిలేషన్ లో ఉన్నానని, పెళ్లి తర్వాత కూడా సన్నిహితంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

సోమవారం ఉదయం మోతీనగర్ లోని తన బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement