తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు

Telangana Glass Bridge

మన పత్రిక, సిద్దిపేట: తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో రూపుదిద్దుకుంటోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ వంతెనను హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేయడం దీని ప్రత్యేకత. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో రూ.4.22 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 150 మీటర్ల పొడవు, 5 … Read more

బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..

Bandlaguda Missing Girl Case

మన పత్రిక, హైదరాబాద్: అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని బండ్లగూడ పోలీసులు వేగంగా స్పందించి కేవలం రెండు గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘౌస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి బుధవారం మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. దీనితో ఆందోళనకు గురైన పాప తల్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర … Read more

సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు.. డెలివరీ బాయ్ అరెస్ట్

Mule Accounts Cyber Crime

మన పత్రిక, హైదరాబాద్: సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న జీడిమెట్లకు చెందిన 27 ఏళ్ల డెలివరీ బాయ్ దిలీప్ సింగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఆన్‌లైన్ గేమింగ్, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, స్టాకింగ్ వంటి నేరాల కోసం ఈ మ్యూల్ ఖాతాలను వినియోగించినట్లు అధికారులు దర్యాప్తులో నిర్ధారించారు. నిందితుడు సేవింగ్స్ అకౌంట్‌కు రూ.25 వేలు, కరెంట్ అకౌంట్‌కు రూ.50 వేలు తీసుకుంటూ సైబర్ నేరగాళ్లకు ఏటీఎమ్, సిమ్ కార్డులు … Read more

మైనర్ బాలికతో కానిస్టేబుల్ వివాహం.. పోలీసుల కేసు

Minor Marriage Case Telangana

మన పత్రిక, హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో మరో బాల్య వివాహం ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వివాహం చేసుకున్నాడనే ఆరోపణలపై హుజూర్‌నగర్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాయని అనిల్ కుమార్ మే 9వ తేదీన ఈ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ … Read more

తెలంగాణలో మద్యం ధరల పెంపు.. జూన్ 2 తర్వాత కొత్త రేట్లు

Telangana Liquor Price Hike

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలో భారీ షాక్ తగలనుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత లిక్కర్ ధరలను 15 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రైస్ ఫిక్సింగ్ కమిటీ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. కొత్త రేట్ల ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం విస్కీ, వోడ్కాపై రూ.100, హైఎండ్ బ్రాండ్లపై రూ.120కి పైగా పెంపు … Read more

బండి భగీరథ్ పోక్సో కేసు.. నేడు కోర్టులో కస్టడీ పిటిషన్

మన పత్రిక, మల్కాజ్‌గిరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో బండి భగీరథ్‌ను ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు మంగళవారం మల్కాజ్‌గిరి పోక్సో కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. బండి భగీరథ్ కేసు హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు త్వరగా దర్యాప్తు ముగించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా భగీరథ్ … Read more

Petrol Diesel Price Hike | మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వారం రోజుల్లోనే రెండోసారి

Petrol Diesel Price Hike

మన పత్రిక, హైదరాబాద్: నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇంధన ధరల భారం మరింత పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా, తాజా సవరణలో లీటరుకు సుమారు 90 పైసల చొప్పున పెంచిన రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర … Read more

May 19 Gold Rates | ఈరోజు బంగారం ధరలు

May 19 Gold Rates 2026

హైదరాబాద్ మార్కెట్లో మే 19వ తేదీ మంగళవారం ఉదయం నమోదైన తాజా బంగారం, వెండి ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి. 📊 ముఖ్య ధరలు (హైదరాబాద్) రకం ధర (₹) 24 క్యారెట్ (10గ్రా) ₹1,56,210 22 క్యారెట్ (10గ్రా) ₹1,43,190 వెండి (1 కిలో) ₹2,90,000 దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇటీవల భారీ హెచ్చుతగ్గులను నమోదు చేస్తున్నాయి. పది రోజుల క్రితం వరుసగా తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగినప్పటికీ, గత … Read more

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు

Andhra Pradesh aqua sector Crisis

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: Andhra Pradesh aqua sector Crisis ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. అమెరికా విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను … Read more

గురుకులాలు, హాస్టళ్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రతి నెలా డైట్ ఛార్జీలు

Telangana Gurukul Diet Charges

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్ల ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తూ నెలవారీ చెల్లింపుల విధానం అమల్లోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, విద్యా శాఖల పరిధిలోని నివాస విద్యాసంస్థల డైట్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఖర్చులు, భవన అద్దెలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 221.24 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేసింది. గతంలో నిధుల చెల్లింపుల్లో 8 నుంచి 9 … Read more