ధర్మపురి ఆలయాల్లో చోరీ.. వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచాన్ని … Read more

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి చంపిన భర్త

హైదరాబాద్‌లోని నల్లకుంటలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు ఘటన జరిగిన 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన త్రివేణిని నమ్మించి నగరానికి … Read more

నేడు కేసీఆర్ కీలక భేటీ.. రేవంత్ సర్కార్‌పై ఫైర్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో నీళ్ల రాజకీయం భగ్గుమంటోంది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడంపై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి … Read more

పటాన్‌చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు.. జనవరి 4న మైత్రి మైదానంలో ఈవెంట్

మన పత్రిక, వెబ్​డెస్క్: పటాన్‌చెరు పట్టణం జాతీయ స్థాయి క్రీడా సంబరానికి వేదిక కానుంది. జనవరి 4న స్థానిక మైత్రి మైదానంలో ‘జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. యువత శారీరక దారుఢ్యం, మానసిక క్రమశిక్షణతో ఎదగాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. పటాన్‌చెరు గడ్డపై తొలిసారిగా … Read more

అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నల్లకుంటలో గుండెలు పగిలే దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణి నిద్రిస్తుండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు తన కుమారుడిని ఇంటి బయట నిలబెట్టడం గమనార్హం. మంటల్లో చిక్కుకున్న త్రివేణి అక్కడికక్కడే సజీవ దహనమైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి కుమార్తె అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఘటన … Read more

రైల్వే టికెట్ ధరల పెంపు.. నేటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు

మన పత్రిక, వెబ్​డెస్క్: రైల్వే ప్రయాణికులపై అదనపు భారం పడింది. పెరిగిన రైల్వే టికెట్ ధరలు నేటి నుంచి (డిసెంబర్ 26) అమల్లోకి వచ్చాయి. దూర ప్రయాణాలను బట్టి ఈ పెంపు వర్తిస్తుంది. 216 నుంచి 750 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 5, 751-1250 కి.మీలకు రూ. 10, 1251-1750 కి.మీలకు రూ. 15, అలాగే 1751 కి.మీ దాటితే రూ. 20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్, ఫస్ట్ క్లాస్ చార్జీలను కిలోమీటరుకు ఒక పైసా … Read more

SVIMS Jobs: TTD ఆధ్వర్యంలో రాత పరీక్ష లేకుండా నోటిఫికేషన్ | SVIMS Recruitment 2025

SVIMS Recruitment 2025 – డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్ & ఇతర పోస్టులు రిక్రూట్మెంట్ అవలోకనం సంస్థ పేరు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి పోస్ట్ పేర్లు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్), ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) మొత్తం పోస్టులు 21 రిక్రూట్‌మెంట్ … Read more

ఆ ఇద్దరు మంత్రులు జైలుకే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఆధారాలతో సహా కేంద్రం వద్ద వారి చిట్టా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వారిపై ఉందని, ఆ ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కూడా సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను బూతులు తిట్టడం వెనుక పెద్ద కుట్ర … Read more

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 304 వాహనాలు సీజ్

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర (2026) వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిన్న ఒక్క రాత్రే రికార్డు స్థాయిలో 304 వాహనాలను (కార్లు, బైకులు) సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. నేరం తీవ్రతను … Read more

TG News: సాగునీటి శాఖ రూ. 22 వేల కోట్ల బకాయిలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గత ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ఈ జాబితాలో సాగునీటి పారుదల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క శాఖే ఏకంగా రూ. 22,926 కోట్లు బాకీ పడటం గమనార్హం. ఆ తర్వాత హైదరాబాద్ వాటర్ బోర్డు రూ. … Read more