హైదరాబాద్లోని నల్లకుంటలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ను పోలీసులు ఘటన జరిగిన 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన త్రివేణిని నమ్మించి నగరానికి తీసుకొచ్చిన వెంకటేష్, బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన త్రివేణిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
