Bus Fire Accident :  బస్సులో మంటలు.. 20 మందికి పైగా సజీవ దహనం

fire accident in private travel bus in kurnool

Bus Fire Accident : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఇందులో 20 మందికి పైగా మంటల్లో చిక్కుకొని చనిపోయారు. కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ సమీపంలోకి బస్సు రాగానే వెనుక నుంచి … Read more

టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం | Tuni Minor Rape Case

Tuni Minor Rape Case

కాకినాడ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఆరోపణలో ఉన్న టీడీపీ నేత తాటిక నారాయణరావు ( TDP Narayana Rao ) (62) మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో, తుని కోమటిచెరువులో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా? ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. బాలికను … Read more

Rain Holiday: నేడు పాఠశాలలకు సెలవు

Today Rain holiday for schools in andhra pradesh october 23 2025

AP Rain Holiday October 23: ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ 5 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు (అక్టోబర్ 23) సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం. ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాల హెచ్చరిక ఉన్న నేపథ్యంలో, అక్కడి పాఠశాలలకు కూడా సెలవు ఇవ్వాలని … Read more

APలో సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా TET – 2 ఏళ్లలో పాస్ కావాలి

AP TET

AP TET 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా TET నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న టీచర్లు, రెండేళ్లలో TET సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జాబ్‌లో కొనసాగాలంటే ఇది తప్పనిసరి. నిరుద్యోగులు, ప్రస్తుత టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శాఖ కసరత్తు చేస్తోంది.

Andhra News: భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు

AP School Rain holiday october 21

ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. APS DMA ప్రకారం, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు.ఈ నేపథ్యంలో, మిగతా జిల్లాల పాఠశాలలకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

టీడీపీ మాలేపాటి సుబ్బనాయుడు మరణం

malepati subbanaidu passes away

Malepati subbanaidu passes away: ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బనాయుడు (60) అనారోగ్యంతో నెల్లూరులో మరణించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. సుబ్బనాయుడు రాజకీయంలో దాదాపు 30 ఏళ్లు గడిపారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు.

Andhra News: ఉద్యోగులకు డీఎ పెంపు చంద్రబాబు ప్రకటన

DA HIKE FOR ANDHRA PRADESH

AP DA Hike News: ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఒక ముఖ్యమైన అడుగు వేశారు. డీఎ పెంపు ద్వారా ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ఈ పెంపు నవంబర్ 1 నుండి అమలు చేయాలని ఆదేశించారు. ఈ చెల్లింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.160 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. అలాగే, పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చెల్లింపులు రెండు విడతల్లో … Read more

తల్లికి వందనం డబ్బులు రావడం లేదా? ఇలా చేస్తే డబ్బులు జమ

Thalliki Vandanam News

Thalliki Vandanam News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం నుంచి డబ్బులు రాక, చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కారణం? కరెంట్ బిల్లుల సమస్య, ఒకరి పేరు మీద రెండు మీటర్లు ఉండటం! రాజమహేంద్రవరం రూరల్‌లో ఎం.నాగదేవి తన పేరు మీద రెండు మీటర్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు. ఒకటి తన ఇంటికి, మరొకటి శ్రీరామ్‌నగర్‌లోని వాంబేగృహాల్లో! నాలుగు రోజులు కార్యాలయం చుట్టూ తిరిగి, తప్పులు సరిచేయించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి … Read more

లడ్డూ ధర పెరుగుతుందా? టీటీడీ ఛైర్మన్ స్పష్టం

ttd laddu price hike rumors

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధర పెరుగుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. “ఇది తప్పుడు ప్రచారం. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. “లడ్డూ ప్రసాదాల ధరను పెంచే ఆలోచననే మాకు లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. భక్తులకు ఒక ఊరట – లడ్డూ … Read more

Viral Video : స్కూటీ నుంచి కింద పడితే కాపాడిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్

students attacked person who helped them up

Viral Video : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఫుల్లుగా తాగి స్కూటీ మీద వెళ్తూ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను లేపాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, తమను కాపాడిన ఆ వ్యక్తి పైనే విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు విద్యార్థులు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గూడురులోని సాధుపేట సెంటర్ లో మద్యం మత్తులో ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు విచక్షణారహితంగా … Read more