Vizag Earthquake : వైజాగ్‌లో భూకంపం

mild earthquake in Visakhapatnam

Vizag Earthquake : వైజాగ్ లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 3.7 గా భూకంప తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, అక్కయ్యపాలెం, విశాలాక్షినగర్, మహారాణిపేట లాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఏలూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 50 మంది ప్రయాణికులు!

ap eluru lingapalem private bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా, లింగపాలెం మండలం, జూబ్లీనగర్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు … Read more

Couple Suicide : విషాదం.. యువజంట ఆత్మహత్య.. భార్య గర్భిణి

husband and wife suicide in Visakhapatnam

Couple Suicide : ఏపీలోని వైజాగ్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జంట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. అయినా కూడా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెం దగ్గర వీళ్లు ఉంటున్నారు. ఆ ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Chittoor pocso case: నిందితుడికి 20 ఏళ్ల జైలు.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు!

chittoor pocso case

మన పత్రిక, వెబ్​డెస్క్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిత్తూరు ఫోక్సో కోర్టు గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి (31), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేశాడు. 2023 నవంబర్ 29 లోపు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ … Read more

Jogi Ramesh Arrest: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్! ఏ1 వాంగ్మూలంతో..

Jogi Ramesh Arrest

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ (jogi ramesh liquor case) మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సెర్చ్ వారెంట్ అందజేసిన అనంతరం అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. “జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు … Read more

Nara Rohit Marriage: నారా రోహిత్ పెళ్లిలో కుటుంబంతో మెరిసిన నారా లోకేష్!

nara rohith marriage

మన పత్రిక, వెబ్​డెస్క్: నారా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. హైదరాబాద్ అజీజ్‌నగర్‌లోని ‘ద వెన్యూ కన్వెన్షన్’లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులు నారా రోహిత్, శిరీషలను లోకేష్ ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, సుఖసంతోషాలతో కూడిన వైవాహిక జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు … Read more

Cyclone Montha : మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఆ రైళ్లన్నీ రద్దు చేసిన రైల్వే శాఖ

trains cancelled in ap due to cyclone montha

Cyclone Montha : ప్రస్తుతం మొంథా తుఫాను వల్ల ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ తుఫాన్ ధాటికి కోస్తా తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దాదాపుగా 107 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు మూడు రోజులు రైళ్లను క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఏ రైళ్లు రద్దయ్యాయో వాటి … Read more

Montha Cyclone : మొంథా తుఫాన్.. ఉప్పాడ స్థానికులను తరలించిన ప్రభుత్వం

uppada residents shifted to rehabilitation centre due to montha cyclone

Montha Cyclone : ప్రస్తుతం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను మొంథా తుఫాన్ ముంచెత్తుతోంది. ఈ తుఫాన్ ధాటికి ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ భారీగా గాలులు వీయడంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లా భారీగా దెబ్బతిన్నది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ స్థానికులను పునరావాస కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం తరలించింది. మొంథా తుఫాన్ వల్ల ఉప్పాడలో భారీ వర్షాలతో పాటు భారీగా … Read more

ప్రత్యక్ష సాక్షి హైమావతి వివరణ (వీడియో) | Kurnool bus accident

Kurnool bus fire accident today

Kurnool bus fire accident today: కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన హృదయ విదారకంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కర్నూలు సమీపంలో ఓ బైకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షి హైమావతి ఏమి చెప్పిందో తెలుసుకుందాం. ఆమె ఇచ్చిన వివరణ వీడియోలో ఉంది.

Bus Accident: కర్నూలు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

Bus fire in kurnool

Kurnool bus fire accident: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత, ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. బాధిత కుటుంబాలు తమ అవసరాలకు వెంటనే సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది. సంప్రదించాల్సిన అధికారులు మరియు వారి ఫోన్ నంబర్లు: అలాగే, ఘటనాస్థలం, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశలో సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కంట్రోల్ రూమ్ … Read more