మన పత్రిక, వెబ్డెస్క్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీజీఎస్ఆర్టీసీ భక్తులకు, ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ డిపో నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు మరియు పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తుల కోరిక మేరకు పంచారామాలు, శ్రీశైలం, వేములవాడ, అరుణాచలం, కొమరవెల్లి మల్లన్న వంటి పుణ్యక్షేత్రాలకు బస్సులు కేటాయిస్తామన్నారు.
Advertisement
అంతేకాకుండా, కార్తీక మాసం సందర్భంగా ఈసీఐఎల్ బస్టాండ్ నుండి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
