TG Karimnagar: లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గంగాధర మండలం మధురా నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ను శుక్రవారం ఓ లబ్ధిదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. మధురా నగర్లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు విషయంలో కార్యదర్శి లబ్ధిదారుడిని వేధించారు. బిల్లుల కోసం అనిల్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని, కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
